Switch to English

ప్రచారం జగన్ సర్కారుది.. అప్పులు, వడ్డీల పాపం ప్రజలది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,515FansLike
57,764FollowersFollow

జగనన్న కానుక.. జగనన్న దీవెన.. జగనన్న అదీ.. జగనన్న ఇదీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలన్నిటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్లే. జగన్ పేరు లేకపోతే, వైఎస్సార్ పేరు వుంటోంది ఆయా సంక్షేమ పథకాలకి. ఇంతకీ, ఈ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని తీర్చేదెవరు.? వాటికి వడ్డీ కట్టేదెవరు.? ఇంకెవరు కడతారు, ప్రజలే కడతారు.. కట్టి తీరాల్సిందే. రాష్ట్రాన్ని అమ్మేసి అయినా, అప్పులు.. వడ్డీలు భవిష్యత్తులో తీర్చాల్సి వస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

వైఎస్ జగన్ మాత్రమే కాదు, అంతకు ముందు చంద్రబాబు కూడా ఇదే చేశారు. అప్పట్లో చంద్రబాబు అప్పులు చేస్తోంటే, ప్రపంచ బ్యాంకు జీతగాడంటూ ఆయన మీద విమర్శలొచ్చాయి. ఆ తర్వాత, అంతకు మించిన స్థాయిలో అప్పులు చేసే రాజకీయ నాయకులు వచ్చారు.. వస్తూనే వున్నారు. ఎవరైతే సంక్షేమ పథకాలకు తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారో.. వాళ్ళే, సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పుల్ని తీర్చేలా చట్టాలు రూపొందిస్తే, ప్రజలకు కాస్తయినా ఈ అప్పుల బాధ తగ్గుతుంది. ‘ప్రభుత్వాలు ఖర్చు చేసేది ప్రజల కోసమే కదా.. మరి, అప్పు తీర్చాల్సింది ప్రజలే కదా..’ అని రాజకీయ నాయకులు తెలివిగా చెబుతుంటారు.

ఔనా, అలాగైతే ఆయా పథకాలకు సొంత పేర్లెందుకు పెట్టాలి.? మహనీయుల పేర్లెందుకు పెట్టకూడదు.? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా అప్పుల పరంగా సరికొత్త రికార్డుల్నే సృష్టిస్తోంది. అయితే, తెలంగాణకి ఆదాయ వనరులు చాలానే వున్నాయి. అందులో హైద్రాబాద్ కూడా ఒకటి.

అభివృద్ధి ఫలాల ద్వారా తెలంగాణకు ఆదాయం వస్తుంది గనుక, రికార్డు స్థాయిలో అప్పులు జరిగినా, అవి తీరే దారి వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు.. రాజకీయ నాయకుల్లో ఎవరూ పేదోళ్ళు లేరు. కానీ, ప్రజలే నానాటికీ అప్పుల్లో కూరుకుపోతున్నారు. రికార్డు స్థాయిలో సలహాదారులు.. వాళ్ళలో మెజార్టీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.. వెరసి, రాష్ట్ర ఖజానా అయినవారికి పప్పూ బెల్లం తరహాలో పంచుకుంటూ పోతున్నారు. పబ్లిసిటీ అధికార పార్టీలది.. అప్పుల పాపాలేమో ప్రజలవి. దీన్ని పరిపాలన అనాలా.? ఇంకేమన్నా అనాలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...