ఇటీవల ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు ఏపీ ముఖ్యమంత్రి. నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ కూడా వున్నారు ముఖ్యమంత్రి కలిసిన ప్రముఖుల్లో. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిశాక, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా సాగిందని సెలవిచ్చారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫలప్రదమైతే, రాష్ట్రానికి మంచిదే కదా.? ఇంతకీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ద్వారా కొత్తగా ఎలాంటి ఫలాలు లభించాయట.? రోజులు గడుస్తున్నాయ్.. దాంతో, ఏ ఫలాలు రాష్ట్రానికి అందాయి.? అందబోతున్నాయి.? అన్నదానిపై జనంలో ఉత్కంఠ పెరగడం సహజమే మరి.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం విరమించుకుందా.? పోలవరం ప్రాజెక్టుకి పెండింగ్ నిధుల్ని ఇస్తామని కేంద్రం చెప్పిందా.? సవరించిన అంచనాల మేరకు 55 వేల కోట్లను కేంద్రం ఆమోదించింది.? ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని కేంద్రం చెప్పిందా.? రాజధాని సంగతేంటి.? దుగరాజపట్నం పోర్టు మాటేమిటి.? కడప స్టీలు ప్లాంటుకి కేంద్ర సహకారం సంగతేంటి.? విశాఖ రైల్వే జోన్ మీద ఏదన్నా స్పష్టత వచ్చిందా.? రాబోతోందా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
ఇందులో ఏ అంశానికి సంబంధించి ‘ఫలం’ రాష్ట్రానికి అందినట్లు.? అందుతున్నట్టు.? నిజానికి, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి.. కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు.. సదరు కేంద్ర మంత్రుల్లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రితో కలిసి మీడియా ముందుకు వచ్చి వుండాలి. అలా వచ్చి వుంటేనే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫలప్రదమయినట్లు. లేదంటే, అంతే సంగతులు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రం నుంచి అధికారులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది.. మంత్రులూ ఢిల్లీ బాట పడుతున్నారు. కానీ, కేంద్రం నుంచి ‘ఫలాలు’ మాత్రం రాష్ట్రానికి వచ్చే సూచన కనిపించడంలేదు. అయిననూ పోయి రావలె హస్తినకు.. తప్పదంటే.. ఆంధ్రపదేశ్ దుస్థితి అంతే.
8807 959705I truly appreciated this fantastic weblog. Make sure you keep up the excellent function. All of the greatest !!!! 23376