Switch to English

వామ్మో.. వరద బాధితుల్లో ఆనందం వెల్లువలా ఉప్పొంగుతోందట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బులుగు మీడియా తీరు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఎక్కడన్నా ఇలా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి వుంటుందా.. ఇలాంటి సందర్భాల్లో.

రాజకీయ పార్టీలు నడుపుతోన్న పత్రికలు, ఛానళ్ళు, ఇతర మీడియా సంస్థలు.. ఇంతకన్నా బిన్నంగా ఆలోచించే పరిస్థితి వుండదు. నిత్యం తమ యజమాని భజనలోనే మునిగి తేలాల్సి వుంటుంది. వరదల దెబ్బకి కొన్ని కుటుంబాల్లో ఒక్కరూ మిగల్లేదు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు.. ఇలా పరిస్థితి అత్యంత బాధాకరంగా వుంది.

ప్రభుత్వం కూలిన ఇళ్ళను తిరిగి కట్టించొచ్చు.. ఆర్థిక సాయం చేయొచ్చు.. కానీ, పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేదు కదా.? అలాంటప్పుడు, బాధిత కుటుంబాల్లో ఆనందం ఎలా వెల్లివిరుస్తుందట.?

పైగా, ముఖ్యమంత్రులు బాధితుల్ని పరామర్శించేటప్పుడు హామీలు గుప్పించడం షరామామూలే. ‘పూర్తిస్థాయిలో ఆదుకుంటాం..’ అని చెబుతారుకానీ, ప్రభుత్వ ఖజానా అందుకు సహకరించదు. ప్రభుత్వం అంచనా వేసిన వరద నష్టం 6 వేల కోట్లకు పై మాటే. మరి, ఆ స్థాయిలో నిధుల్ని ప్రభుత్వం వెచ్చించే పరిస్థితి వుంటుందా.? ఛాన్సే లేదు.

అధికారిక లెక్కలకీ, అనధికారిక నష్టానికీ చాలా తేడా వుంటుంది. ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల్లో ముందస్తుగానే అధికార పార్టీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. బాధితుల్ని ముందుగానే గుర్తిస్తారు. ఇవన్నీ ఏ ప్రభుత్వంలో అయినా జరిగేవే.

ఇందులో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా చొచ్చుకుని వస్తుంటారు. నిజమైన బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందదు సరికదా, అధికార పార్టీకి చెందినవారికి అప్పనంగా బహుమతులు అందుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ‘వరద బురద రాజకీయం’ కథ చాలా పెద్దదే.

జరుగుతున్న పబ్లిసిటీకీ బాధితులకు అందే సాయానికీ అస్సలేమాత్రం పొంతన వుండదు. వరద బాధితులు.. ఎప్పటికీ బాధితులే.. వారికి సాంత్వన ప్రభుత్వాల నుంచి అందుతుందనడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...