గత ప్రభుత్వ హయాంలో ఒంగోలులోని విశ్వవిద్యాలయంకు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు, కనిగిరిలో ట్రిఫుల్ ఐటీ భవనానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేర్లు పెట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ రెండు విద్యాసంస్థలను మంజూరు చేసినా విశ్వవిద్యాలయ భవనాలకు పునాది పడలేదు. ట్రిఫుల్ ఐటీ తరగతులను కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించారు. తర్వాత జిల్లాలో ఈ భవనాల నిర్మాణానికి పామూరు మండలంలో ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ట్రిఫుల్ ఐటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ట్రిఫుల్ ఐటీ భవనాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన స్థలం అనువైంది కాదంటూ నియోజకవర్గంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు వ్యవహారం ముందుకు వెళ్లలేదు. ఇడుపులపాయలో జరుగుతున్న ట్రిఫుల్ ఐటీ తరగతులను ఒంగోలుకు మార్పించారు. విద్యాశాఖ మంత్రి సురేష్ ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రెండు భవనాలు పూర్తి చేయాలని భావించారు.
విశ్వవిద్యాలయం, ట్రిఫుల్ ఐటీ పేర్లు మార్పుకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో పేర్ల మార్పుకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. టంగుటూరు ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా మార్చి ప్రజల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి సురేష్ భావించి.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా విద్యాశాఖలో పనిచేస్తున్న పోలా భాస్కర్ పేరును పరశీలిస్తున్నట్టు సమాచారం.
ఇందుకు గవర్నర్ ఆమోదం కోసం ఉన్నతాధికారులు ఆర్డినెన్స్ ఫైలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు మార్చి వైఎస్సార్ ట్రిఫుల్ ఐటీగా పేరు మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి సురేషే ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
613236 923991Extremely informative and excellent bodily structure of content material , now thats user friendly (:. 316441