Switch to English

వైఎస్ జగన్ బెదిరింపులు.. దేనికి సంకేతం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,767FansLike
57,764FollowersFollow

పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెకేషన్ కోసం మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. విజయవాడలో చికిత్స పొందుతోన్న ఓ వైసీపీ కార్యకర్తను ఆసుపత్రిలో పరామర్శించారు వైఎస్ జగన్.

‘టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త’ అంటూ, వైసీపీ సదరు కార్యకర్త విషయమై విపరీతమైన ఎలివేషన్ ఇస్తోంది. కేవలం, ఇలాంటి పరామర్శల నిమిత్తం తప్ప, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిమిత్తం కావొచ్చు, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నిమిత్తం కావొచ్చు, వైఎస్ జగన్.. రాష్ట్రానికి వచ్చింది లేదు.

ఇదిలా వుంటే, వైఎస్ జగన్ ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. ‘ఇప్పుడు మీరు అధికారంలోకి వున్నారు. రేపు మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు మా కార్యకర్తలు మేం ఎంత చెప్పినా వినకుండా, మీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారు.. అప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయలేం..’ అంటూ హెచ్చరించేశారు వైఎస్ జగన్.

ఇదెక్కడి పంచాయితీ.? టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలి.. అనడం వరకూ బాగానే వుంది. కానీ, ‘మేం అధికారంలోకి వచ్చాక, మీ అంతు చూస్తాం..’ అన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడమేంటి.? అది కూడా ఐదేళ్ళ తర్వాత అట.! ఈలోగా వైసీపీ కార్యకర్తల భద్రతని వైఎస్ జగన్ ప్రమాదంలోకి నెట్టేసేలా వ్యాఖ్యానించడమేంటి.?

వైసీపీ అధికారంలో వున్నప్పుడు, అ పార్టీ రెబల్ ఎంపీగా వున్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ గురించి విన్నాం. టీడీపీ హయాంలో అలాంటి ఘటనలేమీ జరగలేదు కదా.? పోనీ, ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్టయి, జైల్లో వున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద ఏమైనా అలాంటి టార్చర్ జరిగిందేమో వైఎస్ జగన్ చెప్పాలి.

వైసీపీ హయాంలో, అప్పటి టీడీపీ నేతల్ని అర్థరాత్రి అరెస్టు చేసి, అత్యంత కిరాతకంగా వేధించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో అలాంటివేమైనా జరిగాయా.? జరిగి వుంటే వైఎస్ జగన్ ఆ వివరాల్ని బయటపెట్టాలి.

టీడీపీ హయాంలో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని రాజకీయ కారణాలతో హత్య చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఆ ముప్ఫయ్ ఆరు మంది పేర్లు చెప్పమంటే, మీడియాకి సైతం వైఎస్ జగన్ మొహం చాటేస్తుండడం గమనార్హం.

నిజానికి, చాలామంది వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లోనో, విదేశాల్లోనో సేదతీరుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం, బెంగళూరులో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి, వైసీపీ కార్యకర్తలకు దిక్కెవరు.? కూటమి హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పి వుంటే, రాజకీయ కక్ష సాధింపు చర్యలే వుంటే.. వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా వుండేది.?

రాజకీయ హింసని ఎవరూ ప్రోత్సహించకూడదు. ‘మేం అధికారంలోకి వస్తే, మీ అంతు చూస్తాం..’ అని వైఎస్ జగన్ హెచ్చరించడం అత్యంత హేయమైన చర్య. అది వైసీపీ కార్యకర్తల్ని ప్రమాదంలోకి నెట్టేసే చర్య అవుతుందని సాక్షాత్తూ వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఎంపిక చేసుకుని మరీ, కొందరు కార్యకర్తల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు సరే, వారికి ఆర్థికంగా ఏమైనా భరోసా ఇస్తున్నారా.? ప్చ్.. లేదాయె.!

సినిమా

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి...

Ram Charan: రామ్ చరణ్ కు బౌన్సర్ గా.. మైక్ టైసన్...

Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే.. ఇదే...

టర్కీ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టొద్దు : నిఖిల్

ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు టర్కీ సాయం చేస్తూ తన వక్రబుద్ధి చాటుకుంది. మన దేశం...

కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్‌డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ,...

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా....

రాజకీయం

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం..! భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

YS Jagan: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..? తీరు మారని జగన్ పరామర్శ!

YS Jagan: "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.." అని సామెత. ఎవరేమనుకున్నా.. సమాజం నవ్వినా.. విమర్శించినా నాకనవసరం అనుకునే తీరు కొందరికే సాధ్యం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని పలకరించడం తప్పుకాదు.. నవ్వుతూ పలకరించడమే పెద్ద...

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

Ram Charan: క్వీన్ ఎలిజబెత్-II తర్వాత రామ్ చరణ్ కే ఆ గౌరవం.. అదేంటో తెలుసా?

Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైంది. దీంతో భారతదేశంలోని అతికొద్దిమంది సెలబ్రిటీలు దక్కించుకున్న గౌరవాన్ని రామ్ చరణ్ సైతం...

చొక్కా విప్పుతున్న మహేష్..?

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29 ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అన్ని...