Switch to English

వైఎస్ జగన్ బెదిరింపులు.. దేనికి సంకేతం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెకేషన్ కోసం మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. విజయవాడలో చికిత్స పొందుతోన్న ఓ వైసీపీ కార్యకర్తను ఆసుపత్రిలో పరామర్శించారు వైఎస్ జగన్.

‘టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త’ అంటూ, వైసీపీ సదరు కార్యకర్త విషయమై విపరీతమైన ఎలివేషన్ ఇస్తోంది. కేవలం, ఇలాంటి పరామర్శల నిమిత్తం తప్ప, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిమిత్తం కావొచ్చు, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నిమిత్తం కావొచ్చు, వైఎస్ జగన్.. రాష్ట్రానికి వచ్చింది లేదు.

ఇదిలా వుంటే, వైఎస్ జగన్ ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. ‘ఇప్పుడు మీరు అధికారంలోకి వున్నారు. రేపు మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు మా కార్యకర్తలు మేం ఎంత చెప్పినా వినకుండా, మీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారు.. అప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయలేం..’ అంటూ హెచ్చరించేశారు వైఎస్ జగన్.

ఇదెక్కడి పంచాయితీ.? టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలి.. అనడం వరకూ బాగానే వుంది. కానీ, ‘మేం అధికారంలోకి వచ్చాక, మీ అంతు చూస్తాం..’ అన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడమేంటి.? అది కూడా ఐదేళ్ళ తర్వాత అట.! ఈలోగా వైసీపీ కార్యకర్తల భద్రతని వైఎస్ జగన్ ప్రమాదంలోకి నెట్టేసేలా వ్యాఖ్యానించడమేంటి.?

వైసీపీ అధికారంలో వున్నప్పుడు, అ పార్టీ రెబల్ ఎంపీగా వున్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ గురించి విన్నాం. టీడీపీ హయాంలో అలాంటి ఘటనలేమీ జరగలేదు కదా.? పోనీ, ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్టయి, జైల్లో వున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద ఏమైనా అలాంటి టార్చర్ జరిగిందేమో వైఎస్ జగన్ చెప్పాలి.

వైసీపీ హయాంలో, అప్పటి టీడీపీ నేతల్ని అర్థరాత్రి అరెస్టు చేసి, అత్యంత కిరాతకంగా వేధించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో అలాంటివేమైనా జరిగాయా.? జరిగి వుంటే వైఎస్ జగన్ ఆ వివరాల్ని బయటపెట్టాలి.

టీడీపీ హయాంలో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని రాజకీయ కారణాలతో హత్య చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఆ ముప్ఫయ్ ఆరు మంది పేర్లు చెప్పమంటే, మీడియాకి సైతం వైఎస్ జగన్ మొహం చాటేస్తుండడం గమనార్హం.

నిజానికి, చాలామంది వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లోనో, విదేశాల్లోనో సేదతీరుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం, బెంగళూరులో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి, వైసీపీ కార్యకర్తలకు దిక్కెవరు.? కూటమి హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పి వుంటే, రాజకీయ కక్ష సాధింపు చర్యలే వుంటే.. వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా వుండేది.?

రాజకీయ హింసని ఎవరూ ప్రోత్సహించకూడదు. ‘మేం అధికారంలోకి వస్తే, మీ అంతు చూస్తాం..’ అని వైఎస్ జగన్ హెచ్చరించడం అత్యంత హేయమైన చర్య. అది వైసీపీ కార్యకర్తల్ని ప్రమాదంలోకి నెట్టేసే చర్య అవుతుందని సాక్షాత్తూ వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఎంపిక చేసుకుని మరీ, కొందరు కార్యకర్తల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు సరే, వారికి ఆర్థికంగా ఏమైనా భరోసా ఇస్తున్నారా.? ప్చ్.. లేదాయె.!

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ విజయం కోసం తెలంగాణ యువకుని దీక్ష…

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన యువకుడు చట్టా సతీష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపట్ల తనకున్న ఆరాధనను నిరూపించుకున్న హృదయాన్ని హత్తుకునే సంఘటన బుధవారం జరిగింది. ప్రజారాజ్యం రోజుల్లో...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల కావట్లేదని. మేకర్స్ “భారీ మనస్సుతో” ప్రకటించడం...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై భుజాలు తడుముకుంటున్న తెలంగాణ లీడర్స్

కోనసీమలో కొబ్బరి చెట్టుకి ఏదన్నా తెగులు సోకితే, ‘నర దిష్టి’ అనడం అక్కడ సర్వసాధారణం.! కోనసీమ ఉప్పెన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో, ‘మన కొబ్బరికి దిష్టి తగిలింది’ అని అక్కడి రైతులు మాట్లాడుకోవడం...

తెలంగాణలో జనసేన బలోపేతం – ఉత్సాహంగా జనశ్రేణుల సమావేశం

హైదరాబాద్ రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన తెలంగాణ జనశ్రేణుల విస్తృతస్థాయి సమావేశం జనసేన కార్యకర్తలతో సందడి చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ బి....