YS Jagan: ముచ్చటగా ‘మూడు’.! వైఎస్ జగన్‌కి ‘దేవుడి’ ఝలక్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,274FansLike
57,764FollowersFollow

YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా తరచూ ఆయన నోట వస్తుంటుంది. మూడు రాజధానులు కావొచ్చు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం కావొచ్చు.. అను నిత్యం, వైఎస్ జగన్ నోట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో.!

దేవుడి స్క్రిస్టు ప్రకారమే అనుకోవాలో.. ఆ మూడు గురించి పదే పదే మాట్లాడటం వల్ల ఆ ‘మూడు’తోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘దేవుడు’ షాక్ ఇచ్చాడోగానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడూ వైసీపీకి షాక్ ఇచ్చాయి. పైగా, ఇక్కడ మూడు ప్రధాన సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు గెలవడం గమనార్హం.

ఒకరేమో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, ఒకరేమో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.. ఇంకొకరేమో కాపు సామాజిక వర్గానికి చెందినవారు.! మొత్తంగా ఈ ముగ్గురూ టీడీపీ నుంచే గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కులాల కుంపట్లను రాజేస్తోందన్నది బహిరంగ రహస్యం. కమ్మ సామాజిక వర్గం మీద అయితే వైసీపీ చిమ్ముతోన్న విషం అంతా ఇంతా కాదు.

రాయలసీమ నుంచే రెండు సీట్లను ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ) టీడీపీ గెలుచుకుంది. రాయలసీమ నిజానికి వైసీపీ కంచు కోట. ‘వై నాట్ కుప్పం..’ అని వైసీపీ నినదిస్తే, ‘వై నాట్ పులివెందుల’ అంటూ, పులివెందులలోనూ వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ. న్యాయ రాజధాని.. అంటూ రాయలసీమ ప్రజల్ని ఊరించిన వైసీపీ.. ఆ న్యాయ రాజధాని పేరుతో టీడీపీని దెబ్బ కొడదామనుకున్న వైసీపీకి.. అక్కడే, ఆ రాయలసీమలోనే పట్టభద్రులు షాక్ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర సంగతి సరే సరి.! పేరుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అసలు సిసలు రాజధాని అదే.! విశాఖ విషయంలో వైసీపీ చేస్తూ వచ్చిన ప్రచారం. ఇక్కడా వైసీపీ బొక్క బోర్లా పడింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కులం చూడం.. మతం చూడం.. అంటుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! పట్టభద్రులూ అవేమీ చూడలేదు.. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లేశారు.

ఇకపై ‘మూడు’ అన్న మాట ప్రస్తావించాలంటేనే మైండ్ బ్లాంక్ అయ్యేలా పట్టభద్రులు తీర్పునిచ్చారు. ‘అబ్బే, మా ఓటర్లు వేరే వున్నారు..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల బుకాయించొచ్చుగాక… కానీ, డ్యామేజ్ ‘కంట్రోల్ చేయలేని’ స్థాయిలో జరిగింది.

6 COMMENTS

సినిమా

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

రాజకీయం

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా...

వేట్లపాలెం పేలుడు: నిబంధనల ఉల్లంఘనే కారణం – పవన్ కళ్యాణ్

సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు...

Chiranjeevi: ‘50 రోజుల మన శంకరవరప్రసాద్ గారు’.. వండర్స్ ఎన్నో..

Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో...

సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన సభ్యత్వ జోరు

తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో...

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన భారీ స్పందనతో ఈ పాన్...