Switch to English

YS Jagan: ముచ్చటగా ‘మూడు’.! వైఎస్ జగన్‌కి ‘దేవుడి’ ఝలక్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా తరచూ ఆయన నోట వస్తుంటుంది. మూడు రాజధానులు కావొచ్చు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం కావొచ్చు.. అను నిత్యం, వైఎస్ జగన్ నోట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో.!

దేవుడి స్క్రిస్టు ప్రకారమే అనుకోవాలో.. ఆ మూడు గురించి పదే పదే మాట్లాడటం వల్ల ఆ ‘మూడు’తోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘దేవుడు’ షాక్ ఇచ్చాడోగానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడూ వైసీపీకి షాక్ ఇచ్చాయి. పైగా, ఇక్కడ మూడు ప్రధాన సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు గెలవడం గమనార్హం.

ఒకరేమో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, ఒకరేమో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.. ఇంకొకరేమో కాపు సామాజిక వర్గానికి చెందినవారు.! మొత్తంగా ఈ ముగ్గురూ టీడీపీ నుంచే గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కులాల కుంపట్లను రాజేస్తోందన్నది బహిరంగ రహస్యం. కమ్మ సామాజిక వర్గం మీద అయితే వైసీపీ చిమ్ముతోన్న విషం అంతా ఇంతా కాదు.

రాయలసీమ నుంచే రెండు సీట్లను ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ) టీడీపీ గెలుచుకుంది. రాయలసీమ నిజానికి వైసీపీ కంచు కోట. ‘వై నాట్ కుప్పం..’ అని వైసీపీ నినదిస్తే, ‘వై నాట్ పులివెందుల’ అంటూ, పులివెందులలోనూ వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ. న్యాయ రాజధాని.. అంటూ రాయలసీమ ప్రజల్ని ఊరించిన వైసీపీ.. ఆ న్యాయ రాజధాని పేరుతో టీడీపీని దెబ్బ కొడదామనుకున్న వైసీపీకి.. అక్కడే, ఆ రాయలసీమలోనే పట్టభద్రులు షాక్ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర సంగతి సరే సరి.! పేరుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అసలు సిసలు రాజధాని అదే.! విశాఖ విషయంలో వైసీపీ చేస్తూ వచ్చిన ప్రచారం. ఇక్కడా వైసీపీ బొక్క బోర్లా పడింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కులం చూడం.. మతం చూడం.. అంటుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! పట్టభద్రులూ అవేమీ చూడలేదు.. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లేశారు.

ఇకపై ‘మూడు’ అన్న మాట ప్రస్తావించాలంటేనే మైండ్ బ్లాంక్ అయ్యేలా పట్టభద్రులు తీర్పునిచ్చారు. ‘అబ్బే, మా ఓటర్లు వేరే వున్నారు..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల బుకాయించొచ్చుగాక… కానీ, డ్యామేజ్ ‘కంట్రోల్ చేయలేని’ స్థాయిలో జరిగింది.

6 COMMENTS

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు చేయాల్సిందే..

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం తెలుగు సినిమాలు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తెరకెక్కడమే....

అఖండ-2 టీజర్ ఆగయా.. బాలయ్య తాండవం..

బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ రానే వచ్చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది....

వైసీపీ ‘కల్తీ’ రాజకీయం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో ‘కల్తీ’కి గురయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేసులు నమోదయ్యాయి.. అరెస్టులు కూడా జరిగాయి. టీటీడీకి అప్పట్లో నెయ్యి సరఫరా చేసిన కంపెనీల...

సాక్షిపై దాడి.! టీడీపీ కార్యాలయంపై దాడి.! అభిమానస్తుల బీపీ, షుగర్.. వల్లే కదా జగన్.!

వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న టీడీపీ కార్యాలయ...

‘కన్నప్ప’ మూవీ శివుడి ఆజ్ఞ.. మోహన్ బాబు, విష్ణు ఎమోషనల్..

తాము కన్నప్ప మూవీని తీయడం శివుడి ఆజ్ఞ అని మంచు మోహన్ బాబు, విష్ణు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. మోహన్ బాబు,...