Switch to English

మధుసూదన్ రావ్.. గుర్తు పెట్టుకో.! జగన్ అసహనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,120FansLike
57,764FollowersFollow

సెల్ఫ్ ట్రోలింగ్ మెటీరియల్‌లా తయారైంది ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. ‘మధుసూధన్ రావ్.. గుర్తు పెట్టుకో..’ అంటూ ఓ పోలీస్ అధికారి మీద అసహనంతో ఊగిపోయారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

‘మీ టోపీ మీదున్న సింహాలు దేనికో తెలుసా.?’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు సినిమాల్లోని కమెడియన్ల కామెడీ సీన్లను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సింహాల’ కామెంట్లతో రీ-క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.

రాష్ట్రంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి హయాంలో అరాచకం రాజ్యమేలుతోందన్నది వైసీపీ ఆరోపణ. ఇదే ఆరోపణలతో అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాలు భుజాన వేసుకుని వెళ్ళారు వైసీపీ ప్రజా ప్రతినిథులు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ నేతృత్వంలో.

ఈ క్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు కొన్ని ప్లకార్డుల్ని తీసుకెళ్ళారు. వాటిని పోలీస్ అధికారులు చించేశారట. అదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనానికి కారణం. ‘ప్రజా ప్రతినిథుల చేతుల్లోని ప్లకార్డుల్ని చింపే కార్యక్రమం చేసే హక్కు మీకెవరిచ్చారు.. మధు సూదన్ రావ్.. గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఒకేలా వుండదు..’ అంటూ వైఎస్ జగన్ ఆవేశంతో ఊగిపోయారు.

అయినా, పోలీస్ టోపీ మీదున్న సింహాల గురించి, పోలీస్ అధికారులకి ‘మీకు వాటి గురించి తెలుసా.?’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేశపడటమేంటో. అదే పోలీస్ అధికారులు, ఆ సింహాల ‘పవర్’ గురించి చెబితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమైపోతారో ఏమో.!

వైసీపీ అధికారంలో వున్నప్పుడు, వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేసిందీ చూశాం. చట్ట సభల్లో, చట్ట సభల బయటా.. అరాచకం రాజ్యమేలిందన్నది నిర్వివాదాంశం. జగన్ అతిగా ఆవేశపడటం దండగ.. ఎందుకంటే, అసలు కథ ఇప్పుడే మొదలైంది.!

1 COMMENT

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

వైసీపీ సీమ రాజకీయం.! తెరవెనుక విభజన వాదం.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కర్మ, కర్త, క్రియ.. అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి.! ఆయన వేసిన బీజం, ఆయన సృష్టించిన ప్రాంతీయ విద్వేషం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చేసింది....

తీర రక్షణకు గ్రీన్ షీల్డ్… జనవరి చివరికి రూట్‌మ్యాప్ సిద్ధం

తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’కు అడ్డంకులు.. ఫ్యాన్స్ లో ఆందోళన

Rajasaab: సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

సాక్షిపై న్యాయ పోరాటం నుంచి ఎకనామిక్ విజన్ వరకు: లోకేష్ స్పష్టీకరణ

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని...