అబద్ధాల జగన్: టీడీపీ కార్యాలయంపై దాడి జరగలేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,586FansLike
57,764FollowersFollow

జగన్ అంటే అబద్ధం.. అబద్ధం అంటేనే జగన్.! ఇది ఇంకోసారి నిరూపితమయ్యింది.! వైసీపీ హయాంలో, వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు ‘బీపీ, షుగర్’ వంటి వ్యాధుల బారిన పడి, ఆ కోపంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.! ఇది స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇచ్చిన స్టేట్మెంటు.!

‘నన్ను తిడితే, మన అభిమానస్తులు కొందరు బీపీ, షుగర్ కారణంగా ఆవేశకావేశాలకు గురయ్యారు..’ అంటూ, అప్పట్లో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని చిత్ర విచిత్రంగా వెనకేసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ముఖ్యమంత్రి హోదాలో.

ఇప్పుడేమో, అసలు టీడీపీ కార్యాలయంపై దాడే జరగలేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ దాడి కేసులో అరెస్టయి జైల్లో వున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ని పరామర్శించడానికి వచ్చి సుద్దులు చెబుతున్నారు. సుద్దులు కావివి, సుద్ద అబద్ధాలు.!

టీడీపీ కార్యాయాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి, తగలబెట్టే ప్రయత్నం చేశాయి. ఆనాటి ఆ ఘటనలో టీడీపీకి చెందిన పలువురు నేతల వాహనాలు తగలబడ్డాయి. టీడీపీ కార్యాలయం దాదాపుగా ధ్వంసమైంది. టీడీపీ కార్యాలయంలో వున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే వున్నాయి. విధ్వంసంపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి ప్రభుత్వం చేష్టలుడిగా కూర్చుంది.

ప్రభుత్వాధినేత, ‘అభిమానస్తులకి బీపీ వచ్చింది’ అని చెప్పాక, పోలీసు శాఖ మాత్రం, దోషులపై చర్యలు తీసుకునే పరిస్థితి వుంటుందా.? రివర్స్‌లో టీడీపీ మీదనే అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం చూశాం.

ప్రభుత్వం మారాక, ఆనాటి ఘటనపై విచారణ షురూ అయ్యింది.. అదీ పద్ధతిగా. అధికారంలోకి వస్తూనే కూటమి ప్రభుత్వం, కేసులు నమోదు చేయించి, వైసీపీ నేతల్ని అరెస్టు చేయించి వుండాలి. కానీ, అరెస్టు విషయంలో సంయమనం పాటించింది.

నాటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం చూసీ చూడనట్టుగా ఎలా వదిలేస్తుంది.?

ఆనాటి దాడికి సంబంధించిన విజువల్స్ కావాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సొంత మీడియా సాక్షి నుంచి వీడియోస్ తెప్పించుకుని చూడొచ్చు. ఏ స్థాయిలో వైసీపీ మూకలు అప్పట్లో
అరాచకం సృష్టించాయో. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతోపాటు, అందులో వున్న సిబ్బందినీ సామూహికంగా హత్య చేసే ఉద్దేశ్యంతో వైసీపీ మూకలు ఈ దారుణానికి తెగబడ్డాయి.

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారమే వుండకూడదు. స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నాయకుల మీద హత్యాయత్నాలు.. ఇదిగో, ఇలా రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాల మీద దాడులు.. ఇదేం పద్ధతి.? ‘అభిమానస్తులు – బీపీ, షుగర్’ అంటూ అప్పట్లో కబుర్లు చెప్పి, ఇప్పుడసలు దాడే జరగలేదని జగన్ చెబుతున్నారంటే, జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.

ఏం, టీడీపీకి అభిమానస్తులు వుండరా.? జనసేనకి, బీజేపీకి అభిమానస్తులు వుండరా.? ఆ అభిమానస్తులకి బీపీ, షుగర్లు లేవా.? వైసీపీ కార్యాలయాల మీదకి దూసుకెళితే.? ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అది ఆయన రాజకీయ భవితవ్యానికే మంచిది.

సినిమా

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ...

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

రాజకీయం

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

ఎక్కువ చదివినవి

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంబళ’, ‘మద...

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.. ఎలాగంటే

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన వారెందరో ఉన్నారు. అయినా.. ఆమె వృధ్యాప్య...

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...