Switch to English

అబద్ధాల జగన్: టీడీపీ కార్యాలయంపై దాడి జరగలేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

జగన్ అంటే అబద్ధం.. అబద్ధం అంటేనే జగన్.! ఇది ఇంకోసారి నిరూపితమయ్యింది.! వైసీపీ హయాంలో, వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు ‘బీపీ, షుగర్’ వంటి వ్యాధుల బారిన పడి, ఆ కోపంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.! ఇది స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇచ్చిన స్టేట్మెంటు.!

‘నన్ను తిడితే, మన అభిమానస్తులు కొందరు బీపీ, షుగర్ కారణంగా ఆవేశకావేశాలకు గురయ్యారు..’ అంటూ, అప్పట్లో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని చిత్ర విచిత్రంగా వెనకేసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ముఖ్యమంత్రి హోదాలో.

ఇప్పుడేమో, అసలు టీడీపీ కార్యాలయంపై దాడే జరగలేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ దాడి కేసులో అరెస్టయి జైల్లో వున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ని పరామర్శించడానికి వచ్చి సుద్దులు చెబుతున్నారు. సుద్దులు కావివి, సుద్ద అబద్ధాలు.!

టీడీపీ కార్యాయాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి, తగలబెట్టే ప్రయత్నం చేశాయి. ఆనాటి ఆ ఘటనలో టీడీపీకి చెందిన పలువురు నేతల వాహనాలు తగలబడ్డాయి. టీడీపీ కార్యాలయం దాదాపుగా ధ్వంసమైంది. టీడీపీ కార్యాలయంలో వున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే వున్నాయి. విధ్వంసంపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి ప్రభుత్వం చేష్టలుడిగా కూర్చుంది.

ప్రభుత్వాధినేత, ‘అభిమానస్తులకి బీపీ వచ్చింది’ అని చెప్పాక, పోలీసు శాఖ మాత్రం, దోషులపై చర్యలు తీసుకునే పరిస్థితి వుంటుందా.? రివర్స్‌లో టీడీపీ మీదనే అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం చూశాం.

ప్రభుత్వం మారాక, ఆనాటి ఘటనపై విచారణ షురూ అయ్యింది.. అదీ పద్ధతిగా. అధికారంలోకి వస్తూనే కూటమి ప్రభుత్వం, కేసులు నమోదు చేయించి, వైసీపీ నేతల్ని అరెస్టు చేయించి వుండాలి. కానీ, అరెస్టు విషయంలో సంయమనం పాటించింది.

నాటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం చూసీ చూడనట్టుగా ఎలా వదిలేస్తుంది.?

ఆనాటి దాడికి సంబంధించిన విజువల్స్ కావాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సొంత మీడియా సాక్షి నుంచి వీడియోస్ తెప్పించుకుని చూడొచ్చు. ఏ స్థాయిలో వైసీపీ మూకలు అప్పట్లో
అరాచకం సృష్టించాయో. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతోపాటు, అందులో వున్న సిబ్బందినీ సామూహికంగా హత్య చేసే ఉద్దేశ్యంతో వైసీపీ మూకలు ఈ దారుణానికి తెగబడ్డాయి.

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారమే వుండకూడదు. స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నాయకుల మీద హత్యాయత్నాలు.. ఇదిగో, ఇలా రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాల మీద దాడులు.. ఇదేం పద్ధతి.? ‘అభిమానస్తులు – బీపీ, షుగర్’ అంటూ అప్పట్లో కబుర్లు చెప్పి, ఇప్పుడసలు దాడే జరగలేదని జగన్ చెబుతున్నారంటే, జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.

ఏం, టీడీపీకి అభిమానస్తులు వుండరా.? జనసేనకి, బీజేపీకి అభిమానస్తులు వుండరా.? ఆ అభిమానస్తులకి బీపీ, షుగర్లు లేవా.? వైసీపీ కార్యాలయాల మీదకి దూసుకెళితే.? ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అది ఆయన రాజకీయ భవితవ్యానికే మంచిది.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 15 మార్చి 2025

పంచాంగం తేదీ 15-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి మ. 12.49 వరకు,...

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత అక్కడే మరో...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...