మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట.

అంతకు ముందెన్నడూ ఇలాంటి వార్తని బహుశా వైసీపీ శ్రేణులు విని వుండకపోవచ్చు. వైఎస్ జగన్ ఏంటి.? సాయం చేయడమేంటి.? అని వైసీపీ శ్రేణులు విస్తుపోతున్నాయన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

కొన్ని సందర్భాల్లో వైసీపీ తరఫున ‘సాయం’ ప్రకటించి వుండొచ్చు. కానీ, బాధిత కుటుంబాలకు ఆయా సాయాలు అందాయా.? అన్నదానిపై చాలా అనుమానాలున్నాయి. కోవిడ్ సమయంలోనూ ఈ పరిస్థితిని చూశాం.

ఆపరేషన్ సిందూర్‌లో భారత జవాను మురళి నాయక్, వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా తాను సైతం మరో 25 లక్షల రూపాయల్ని బాధిత కుటుంబానికి అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా, మురళీ నాయక్ కుటుంబాన్ని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన జగన్, తన హయాంలోనే ఈ 50 లక్షల సాయానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లు సొంత డబ్బా కొట్టుకున్నారు.

మరోపక్క, ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సైతం, పార్టీ తరఫున పాతిక లక్షల రూపాయల సాయాన్ని జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అందజేస్తామని ప్రకటించడం గమనార్హం.

అయితే, మొన్నామధ్యన బెజవాడ వరదల నేపథ్యంలో కోటి రూపాయల సాయం వరద బాధితుల కోసం ప్రకటించినా, ఆ మొత్తాన్ని ఎవరికి ఎలా ఇచ్చారో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి, ఇప్పుడు ఈ పాతిక లక్షల ప్రకటన సంగతేంటి.? ఇస్తారనే, ఆశిద్దాం.

ఏదిఏమైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఈ మార్పు మంచిదే. ముందు ముందు వైఎస్ జగన్ కూడా, ‘సాయాలు’ బాగానే చేయాల్సి వస్తుందేమో.

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...

‘కల్కి 2’కు గ్లోబల్ టార్గెట్… ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Prabhas నటించిన కల్కి 2898 AD సీక్వెల్‌పై ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకుడు Nag Ashwin ఈసారి ప్రాజెక్ట్ పరిధిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కల్కి 2ను...

“అమరావతిపై విమర్శలా..? వైసీపీ ఖర్చులేంటో గుర్తుందా!”

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వృథా ఖర్చు అంటూ విమర్శిస్తున్న వైసీపీపై ప్రస్తుతం అధికారంలో ఉన్న Telugu Desam Party (టిడిపి) తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. గతంలో YSR Congress Party (వైసీపీ)...

“శ్రమజీవులే దేశానికి బలం” – ప్రేమ్ కుమార్: మే డే వేడుకలు ఘనంగా

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా శ్రమజీవుల సేవలకు గౌరవం తెలియజేస్తూ మోతీనగర్‌లోని ఎస్బీఐ భవనం ఎదురుగా ఉన్న ఈ-సేవ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు దుట్టా...

Daily Horoscope: కర్కాటకకు శుభవార్తలు.. తులకు ఆర్థిక లాభ సూచనలు

ఏప్రిల్ 28 , 2026 మంగళవారం రాశిఫలాలు ఈ రోజు చంద్ర మాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం,...