ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై వైసీపీ అనుకూల మీడియాలో ‘సూపర్ సక్సెస్’ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ, వైసీపీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఢిల్లీ టూర్ తాలూకు అజెండా ఏమిటి.? అజెండాలో తొలి అంశం ప్రత్యేక హోదాయేనని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ తర్వాత చాలా అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నది ఇటు వైసీపీ పార్టీ తరఫునా, వైసీపీ ప్రభుత్వం తరఫునా వస్తోన్న సమాధానం.
వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ సూపర్ సక్సెస్ అవడమంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే దస్త్రంపై సంతకం చేసినట్లే భావించాల్సి వస్తుంది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. పోనీ, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేసిందా.? అంటే అదీ లేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం ఇచ్చిందా.? నో ఆన్సర్. మండలి రద్దుపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసకుందా.? అబ్బే, లేదాయె.! మూడు రాజధానుల ప్రతిపాదానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.? అదీ జరగలేదు. రాజధాని కోసం నిధుల్ని కేంద్రం ప్రకటించిందా.? ఇంకా నయ్యం.. ఏ రాజధానికి కేంద్రం నిధులిస్తుంది చెప్పండి.!
ఇవే కాక, ఇంకా చాలా అంశాలున్నాయి.. కేంద్రం, రాష్ట్రానికి చేయాల్సినవి. వీటిల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి వుంటే, ఢిల్లీలోనే ప్రధాని సమక్షంలోనే వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రెస్మీట్ కన్పించేది. అయినా, జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్సయ్యిందట.. అదీ సూపర్ సక్సెస్ అని వైసీపీ మీడియా చెబుతోంది.
రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు రాష్ట్రంలో అధికార పార్టీ తీరు చూసి. ఇలాంటి భ్రమల్లో బతకడం వల్లే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినేసింది. బహుశా ఆ దుస్థితి కోసం వైసీపీ కూడా తహతహలాడుతున్నట్టుంది.
268142 206192There is noticeably a bundle to learn about this. I assume you created specific good points in capabilities also. 651837
243040 615440Woh I like your content material , saved to bookmarks ! . 327225