Switch to English

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ డీఎస్‌పీ ఏం చేసినట్లు.? ఇంతకీ, అసలేమయ్యింది.?

‘హత్య’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. ఇది వైసీపీకి అనుకూలంగా తీసిన సినిమా. 2019 ఎన్నికల సమయంలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి తెరకెక్కించిన సినిమా ఇది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైసీపీ తీసిన సినిమా ఈ ‘హత్య’.

వైసీపీ అనుకూల సినిమా కావడంతో, సినిమాలో సన్నివేశాలు వైసీపీ కనుసన్నల్లోనే తెరకెక్కాయి. మరోపక్క, ఈ సినిమా తనను కించపర్చేలా వుందనీ, తన కుటుంబ సభ్యుల్ని కించపర్చేలా వుందనీ ఆరోపిస్తూ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు అయిన సునీల్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ అనే వ్యక్తిని విచారణకు పిలిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో చెలామనీలో వున్న వాట్సాప్ గ్రూపుకి అడ్మిన్‌గా వున్నారు పవన్ కుమార్. కాగా, తనను విచారణకు పిలిచి తీవ్రంగా కొట్టారంటూ డీఎస్‌పీ, సీఐ మీద ఆరోపణలు చేస్తూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కుమార్ ఫిర్యాదు చేయడం గమనార్హం.

పవన్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో వైఎస్ జగన్, పై విధంగా స్పందించారు. పోలీసులు తప్పు చేస్తే, శాఖా పరమైన చర్యలుంటాయి. న్యాయ వ్యవస్థ నుంచి కూడా మొట్టికాయలు తప్పవు. అంతేగానీ, అధికారంలోకి వచ్చాక డీఎస్‌పీతో, నిందితుడికి క్షమాపణ చెప్పిస్తాననే ప్రకటన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయడమేంటి.?

ఇలాగైతే, పోలీసు శాఖ సజావుగా పని చేయగలుగుతుందా.? ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ ఇప్పుడే ఇలా అంటున్న వైఎస్ జగన్, అధికారంలో వున్నప్పుడు, ఎంతమంది పోలీసు అధికారులతో ఇలా తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పించినట్లు.?

అసలు ఇదేం పద్ధతి.? వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగేలా వ్యవహరించింది చాలక, మళ్ళీ అలాంటి చీకటి పరిస్థితుల్ని తీసుకొస్తామనే సంకేతాల్ని వైఎస్ జగన్ పంపడం అస్సలేమాత్రం క్షమార్హం కాదు.

సినిమా

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

రాజకీయం

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఎక్కువ చదివినవి

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే మా బాధ తెలిసేది : జాన్వీకపూర్

జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం అమ్మడు మంచి...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా అందింది. మా సమస్యలన్నీ తీరాయి" అంటూ...

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...