Switch to English

చట్టం, న్యాయం.! వైఎస్ జగన్ ఏడుపు, పెడబొబ్బలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

అరరె.. వైసీపీకి ఎంత కష్టమొచ్చింది.? వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారు.. మరో వైసీపీ నేత అబ్బయ్య చౌదరి రేపో మాపో అరెస్టవనున్నారు.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు.. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు.! వైఎస్ జగన్ మాత్రం, బెంగళూరు – గన్నవరం మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అన్నట్టు, మొన్నీమధ్యనే విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చారు.

అంతేనా, సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో తనదైన స్టయిల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా, ‘రాష్ట్రంలో చట్టానికీ, న్యాయానికీ చోటు లేకుండా పోయింది..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాపోతూ ఓ ట్వీటేశారు.

అసలంటూ చట్టం, న్యాయం లేకపోతే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇలా షటిల్ సర్వీస్ బెంగళూరు – గన్నవరం మధ్యన చేసే అవకాశం వుండేదా.? ముందైతే, ఆయనే కదా జైల్లోకి వెళ్ళేది.? నాన్సెన్స్.. ఈ మాత్రం సోయ వుంటే, ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అవుతారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి మరి.

వైసీపీ హయాంలో కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్ట్, చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద కక్ష పూరిత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్, విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేసేందుకు కుట్ర.. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా చాలా పెద్దదే.

వైసీపీ నుంచే ఎంపీగా అప్పట్లో గెలిచిన రఘురామకృష్ణరాజు మీదనే కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘనత వైఎస్ జగన్ సర్కారుదే కదా.! వైసీపీ నాయకుల్నే వైసీపీ ప్రభుత్వం హింసించిన పరిస్థితుల్ని చూశాం. చిన్న అనుమానమొచ్చినా, తమ పార్టీ నేతలని కూడా చూడలేదు వైసీపీ

అత్యంత కిరాతకంగా గూండాల్నీ, రౌడీల్ని దించి.. ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని, ఒక్కోసారి తమ మాట వినని సొంత పార్టీ నేతల్నీ కొట్టించి, వీడియోలు తీసి, వాటిని వైసీపీ అధినాయకత్వానికి పంపి.. పైశాచికానందం పొందారు కొందరు వైసీపీ నాయకులు.

ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా.? ఛాన్సే లేదు.! అప్పుడు, అంటే తన హయాంలో గల్లంతయిన చట్టం, న్యాయం.. గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

కూటమి ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తోందనడానికి నిదర్శనం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా జైలుకు వెళ్ళకపోవడమే. జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయంతోనే వైఎస్ జగన్, రాష్ట్రంలో వుండేందుకు భయపడుతున్నారన్నది బహిరంగ రహస్యం.

అధికారంలో వున్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో సాధించేదేమీ లేదు. అయినా, జగన్ తనంతట తానుగా ఆ ట్వీట్లను వేశారని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే, అవి చదివేంత తీరిక ఆయనకే లేదు.!

ట్విట్టరులో అర్థం పర్థం లేని ట్వీట్లేయడం మానేసి, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించేందుకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే, పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేకి, శాసన సభ సభ్యత్వం మాత్రం ఎందుకు.? ఇది పులివెందులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

శ్రీలీలకు మెగాస్టార్ కానుక..!

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో ప్రముఖ కథానాయిక శ్రీలీల తళుక్కున మెరిసారు. వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ లో...

జనసైనికులకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న...

Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్లో సందడి చేసిన శ్రీలీల.. మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ సినిమా సెట్లో యువ స్టార్...

అప్పులు.! జగన్‌కీ, చంద్రబాబుకీ అదే తేడా.!

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలైనా, దేశమైనా అప్పులు చేయాల్సిందే. నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తోడు సంక్షేమం.. వెరసి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. నిజానికి, అప్పులన్నీ సంక్షేమం కోసమే జరుగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.!...