Switch to English

చట్టం, న్యాయం.! వైఎస్ జగన్ ఏడుపు, పెడబొబ్బలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

అరరె.. వైసీపీకి ఎంత కష్టమొచ్చింది.? వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారు.. మరో వైసీపీ నేత అబ్బయ్య చౌదరి రేపో మాపో అరెస్టవనున్నారు.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు.. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు.! వైఎస్ జగన్ మాత్రం, బెంగళూరు – గన్నవరం మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అన్నట్టు, మొన్నీమధ్యనే విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చారు.

అంతేనా, సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో తనదైన స్టయిల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా, ‘రాష్ట్రంలో చట్టానికీ, న్యాయానికీ చోటు లేకుండా పోయింది..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాపోతూ ఓ ట్వీటేశారు.

అసలంటూ చట్టం, న్యాయం లేకపోతే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇలా షటిల్ సర్వీస్ బెంగళూరు – గన్నవరం మధ్యన చేసే అవకాశం వుండేదా.? ముందైతే, ఆయనే కదా జైల్లోకి వెళ్ళేది.? నాన్సెన్స్.. ఈ మాత్రం సోయ వుంటే, ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అవుతారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి మరి.

వైసీపీ హయాంలో కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్ట్, చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద కక్ష పూరిత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్, విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేసేందుకు కుట్ర.. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా చాలా పెద్దదే.

వైసీపీ నుంచే ఎంపీగా అప్పట్లో గెలిచిన రఘురామకృష్ణరాజు మీదనే కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘనత వైఎస్ జగన్ సర్కారుదే కదా.! వైసీపీ నాయకుల్నే వైసీపీ ప్రభుత్వం హింసించిన పరిస్థితుల్ని చూశాం. చిన్న అనుమానమొచ్చినా, తమ పార్టీ నేతలని కూడా చూడలేదు వైసీపీ

అత్యంత కిరాతకంగా గూండాల్నీ, రౌడీల్ని దించి.. ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని, ఒక్కోసారి తమ మాట వినని సొంత పార్టీ నేతల్నీ కొట్టించి, వీడియోలు తీసి, వాటిని వైసీపీ అధినాయకత్వానికి పంపి.. పైశాచికానందం పొందారు కొందరు వైసీపీ నాయకులు.

ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా.? ఛాన్సే లేదు.! అప్పుడు, అంటే తన హయాంలో గల్లంతయిన చట్టం, న్యాయం.. గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

కూటమి ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తోందనడానికి నిదర్శనం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా జైలుకు వెళ్ళకపోవడమే. జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయంతోనే వైఎస్ జగన్, రాష్ట్రంలో వుండేందుకు భయపడుతున్నారన్నది బహిరంగ రహస్యం.

అధికారంలో వున్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో సాధించేదేమీ లేదు. అయినా, జగన్ తనంతట తానుగా ఆ ట్వీట్లను వేశారని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే, అవి చదివేంత తీరిక ఆయనకే లేదు.!

ట్విట్టరులో అర్థం పర్థం లేని ట్వీట్లేయడం మానేసి, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించేందుకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే, పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేకి, శాసన సభ సభ్యత్వం మాత్రం ఎందుకు.? ఇది పులివెందులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ.

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

రాయలసీమ ‘రాతన’లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  నూతన విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ,...

చేసింది చెప్పుకోలేక పోయాం అన్న జగన్‌కి… టీడీపీ కేడర్ నుంచి వర్షంలా వ్యంగ్యాస్త్రాలు!

రాజకీయాలలో మాటల దాడులు అంతం లేనివి. “చేసింది చెప్పుకోలేక పోయాం” అంటూ జగన్ మీడియా సమావేశాల్లో వాపోతూ ఉండగానే… మరో పక్క టీడీపీ కార్యకర్తలు సూటిగా, స్టైలిష్‌గా, ఘాటు వ్యంగ్యాస్త్రాలతో రిప్లై ఇస్తూ...

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

ఎక్కువ చదివినవి

స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా...

Daily Horoscope: డిసెంబర్ 7, 2025 ఆదివారం రాశిఫలాలు:

మేషం (Aries): ఈ రోజు మీరు పనుల్లో శాంతిగా ముందుకు సాగుతారు. కుటుంబంలో చిన్న విషయాలు మాట్లాడుకుంటూ సర్దుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది....

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించిన రీతూ చౌదరి ఎలిమినేట్...

Daily Horoscope: డిసెంబర్ 3, 2025 – బుధవారం రాశిఫలాలు

మేష (Aries): పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సహచరుల నుండి మంచివార్తలు అందుతాయి. కుటుంబంలో చిన్న విషయాలు సౌఖ్యం కలిగిస్తాయి. ధన వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ప్రయాణాల్లో చిన్న ఆలస్యాలు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్యంలో...

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల...