రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా వుంటుంది. ‘తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా..’ అనే నానుడి వుండనే వుందాయె.!
నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం, మత్స్యకారుల్ని ఎలా ఉద్ధరించేస్తోందో మత్స్యకార దినోత్సవంనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుని వుంటే.. అసలు ఇంత రాద్ధాంతమే జరిగి వుండేది కాదు.
ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చే మహిళల చున్నీలనీ పోలీసులు పక్కన పడేసిన వైనం.. ఇవన్నీ విమర్శలకు తావిస్తున్నా.. అవన్నీ తప్పడంలేదు వైసీపీ ప్రభుత్వానికి.
సరే, ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే, ఆ కార్యక్రమానికి బలవంతంగా తరలించబడ్డ జనం, గేట్లు దూకేసి పారిపోవడం అనేది ఇటీవలికాలంలో సర్వసాధారణమైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, జనసేన పార్టీ మీద ‘రౌడీ సేన’ అనే పంచ్ డైలాగు పేల్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంతే, జనసేన నేతలు చిట్టా విప్పడం మొదలు పెట్టారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దగ్గర్నుంచి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే కారు డ్రైవరుని హత్య చేసి, మృతుడి ఇంటికి డెడ్బాడీని డోర్ డెలివరీ చేసిన వైనం వరకు.. అన్ని విషయాలూ చర్చకు వచ్చేశాయ్.
ఒక్క విమర్శ.. అదీ ‘రౌడీ సేన’ అని వైఎస్ జగన్ విమర్శించడంతోనే ఇంత రాద్ధాంతం జరిగింది. 16 నెలలు జైలుకు ఎవరెళ్ళారు.? ఎవరు ఎవర్ని రౌడీలంటున్నారు.? అంటూ జనసైనికులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
‘2019 ఎన్నికల్లో జనం ఓడించారు..’ అంటూ స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన గురించి చెబుతున్నారు. మరి, జనసేన అంటే అంతలా ఉలిక్కిపడాల్సిన పనేముంది.?
448442 14095Id need to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a put up that will make individuals feel. In addition, thanks for allowing me to comment! 406946
472421 231605really nice post, i undoubtedly adore this wonderful website, carry on it 776061