Switch to English

వైఎస్ జగన్ మీద పవన్ కళ్యాణ్ పరువు నష్టం దావా వేస్తే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,964FansLike
57,764FollowersFollow

‘మనిషికొచ్చినంత కోపం వచ్చింది.. అందుకే, పరువు నష్టం దావా వేస్తానంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..’ ఓ సోషల్ మీడియా పోస్ట్ సారాంశమిది.!

అదానీ – సెకీ ఒప్పందాలు, పదిహేనొందల కోట్లకు పైగా లంచం వైసీపీ ప్రభుత్వానికి అందిన వైనమంటూ ఆరోపణలు.. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మీడియా ముందుకొచ్చి, ‘నాకు శాలువాలు కప్పి, సన్మానం చెయ్యాలి.. అవార్డులేమైనా వుంటే ఇవ్వాలి.. అంతేగానీ, నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారా.? పరువు నష్టం దావా వేస్తాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు.

పరువు నష్టం దావానా.? అదెలా ఉంటుంది.? అని వైఎస్ జగన్ మీద వెటకారాలు షురూ అయ్యాయి సోషల్ మీడియా వేదికగా.

ప్యాకేజీ స్టార్ అనీ, దత్త పుత్రుడనీ పవన్ కళ్యాణ్ మీద ఏ ఆధారాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు.? జగన్ చేసిన పై వ్యాఖ్యల మీద జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గనుక పరువు నష్టం దావా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా.? అది వేరే లెవల్ అంతే.!

పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం పరువు నష్టం దావా వేసే అవకాశం వుంది. ఎందుకంటే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ చెలరేగిపోయారు కదా.!

నిజానికి, ఇది ఇంకా సీరియస్ కేసు.! హత్య కేసుని చంద్రబాబు మెడకి చుట్టే ప్రయత్నం జగన్ అండ్ కో చేశారు కాబట్టి, పరువు నష్టం దావా చంద్రబాబు వేస్తే, వైసీపీ ఖేల్ ఖతం అంతే.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు అత్యంత సహజం.! పైగా, ఈ అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసినవి కావు. దేశంలో రాజకీయ నాయకులు చేసినవీ కావు. అంతర్జాతీయ స్థాయిలో నమోదైన కేసు, దీనికి సంబంధించి నమోదైన చార్జి షీటు వ్యవహారం.

ఇంతకీ, వైఎస్ జగన్ ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు.? అమెరికాలో ఈ కేసు విచారణ చేస్తోన్న దర్యాప్తు సంస్థ మీదనా.? అమెరికా అధ్యక్షుడిపైనా.? వైఎస్ జగన్ ప్రెస్ మీట్ల కోసం స్క్రిప్టు రాసేవాళ్ళు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. లేకపోతే, జగన్ నుంచి వచ్చే ఆ మాటలు ప్రతిసారీ కామెడీ అయిపోతున్నాయి.

అన్నట్టు, వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఎడాపెడా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగిస్తూనే వున్నారు. ప్రభుత్వాధినేతల విషయంలో పులివెందుల చేస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు నష్టం దావాలు నమోదైతే ఏంటి పరిస్థితి.?

ఒక్కటి మాత్రం నిజం.. ‘పరువు’ అనే మాటని వైఎస్ జగన్ ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిది. చెల్లెలు కట్టుకున్న పసుపు రంగు చీర మీద రాజకీయ విమర్శలు చేసేంత దిగజారుడుతనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. జగన్ మీద స్వయానా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పరువు నష్ట దావా వేస్తే ఏంటి పరిస్థితి.?

సినిమా

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ...

రాజకీయం

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన...

ఎక్కువ చదివినవి

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. సైఫ్ కు...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ రావడం, కుట్రపూరితంగా సినిమా హెచ్‌డీ వీడియోని...

సైఫ్ దాడి.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి థానేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.....

అంజలి అదిరిపోయే అందాలను చూశారా..!

యాక్టర్ అంజలి ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. పైగా ఇప్పుడు ఆమెకు మెయిన్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా దక్కుతున్నాయి. వయసు పైబడ్డ తర్వాత ఆమెకు అవకాశాలు పెరగడం...

భారీ రికార్డు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం.. రూ.100 కోట్ల షేర్..!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది....