Switch to English

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు కాగా, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. పైగా, అందులో ఒకరు బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య.

చిత్రమేంటంటే, ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందినవారు. గతంలో టీడీపీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాచుర్యంలోకి వచ్చారు.. ఆ ఆమేజ్‌తోనే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. తెలంగాణకే చెందిన నిరంజన్ రెడ్డిని కూడా రాజ్యసభకు పంపుతోంది ఏపీలోని అధికార పార్టీ. ఆ నిరంజన్ రెడ్డి ఎవరో కాదు, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి. ఈయన ప్రముఖ న్యాయవాది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి మరోమారు రాజ్యసభకు వెళ్ళే అవకాశం దక్కింది. మిగిలిన వ్యక్తి బీద మస్తాన్ రావు. ఆయనకు బీసీ కోటాలో అవకాశం దక్కిందన్నది వైసీపీ వాదన.

అంతా బాగానే వుందిగానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ ఉద్యమ నేతలెవరూ లేరా.? బీసీ వర్గాలకు చెందిన నాయకులు వైసీపీలో లేరా.? తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను ఎందుకు వైసీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. ఆర్.కృష్ణయ్య ద్వారా ఏపీలో బీసీ ఓటు బ్యాంకుని ‘పదిలం’ చేసుకోవాలన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహం.

అంతేనా, తెలంగాణ మీద కొత్తగా వైసీపీ అధినేతకు ఆశలేమైనా వున్నాయా.? లేకపోతే, తెలంగాణ నుంచి ఏకంగా ఇద్దర్ని ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభకు వైఎస్ జగన్ ఎందుకు పంపిస్తున్నట్లు.? సరే, వైసీపీ అధినేతగా ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ఇష్టం.

కానీ, రాజ్యసభలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తరఫున విభజన సమస్యలపైనో, ప్రత్యేక హోదాపైనో, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ విషయమ్మీదనో మాట్లాడాల్సి వస్తే, ఆర్ కృష్ణయ్య కావొచ్చు.. నిరంజన్ రెడ్డి కావొచ్చు ఎవరి తరఫున నిలబడతారు.? ఆంధ్రప్రదేశ్ తరఫునా.? తెలంగాణ తరఫునా.?

ఈ ప్రశ్నకు వైసీపీ సమాధానమివ్వాల్సి వుంది.. ఆ సమాధానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...