Switch to English

YS Bharathi: వార్తలు, విశ్వసనీయత.! ‘సాక్షి’లో ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

YS Bharathi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పేరు ఈ మధ్య తరచూ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఉగాది వేడుకల్లో ఇటీవల వైఎస్ భారతి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే.

భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఏనాడూ ఆమె తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోలేదన్న విమర్శలున్నాయి. సరే, అది ఆమె వ్యక్తిగతం. హిందూ దేవాలయాలకు ఆమె వెళ్ళరంటూ పదే పదే రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, లిక్కర్ స్కామ్ ఆరోపణలూ భారతిపై గట్టిగా వినిపిస్తుంటాయి. అన్నట్టు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ వైఎస్ భారతిపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలేనా.?

అసలు విషయానికొస్తే, వార్తలు.. విశ్వసనీయత.. అంటూ ఇటీవల ‘సాక్షి’ మీడియా వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ భారతి. ఓ వార్త రాసేటప్పుడు, సంబంధిత వ్యక్తుల వెర్షన్‌ని కూడా తీసుకోవాలని సూచించారామె. ఈ వ్యవహారం మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసునే తీసుకుంటే, ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడు చంద్రబాబు నుంచి సాక్షి మీడియా వివరణ తీసుకుందా.? అప్పట్లో చంద్రబాబే ఆ హత్య చేయించినట్లు తీర్మానించిన సాక్షి మీడియా, ఈ మధ్య ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకుని మతం మార్చుకున్న వివేకానందరెడ్డి, ఆ వివాహం వల్లే కుటుంబంలో గొడవలు రావడంతో హత్యకు గురయ్యారంటూ పేర్కొంటోంది.

సో, ఏది విశ్వసనీయత కలిగిన వార్త.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సన్నబియ్యంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ‘సాక్షిలో తప్పు రాశారు అధ్యక్షా..’ అని నినదించారు. అంటే, సాక్షికి విశ్వసనీయత లేదని స్వయంగా వైఎస్ భారతి భర్త వైఎస్ జగన్ చెప్పినట్లే కదా.!

ఎలా చూసినా, వైఎస్ భారతి తీసుకున్న క్లాస్ సాక్షి మీడియాకేనని అర్థమవుతోంది. మరి, యజమాని మాటల్ని, హెచ్చరికల్ని, సూచనల్ని సాక్షి మీడియా పరిగణనలోకి తీసుకుంటుందా.? విశ్వసనీయత గురించి ఆలోచిస్తుందా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...