ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్.!
సో, ఇకపై అవినాశ్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కొన్నాళ్ళ పాటు రచ్చ వుండబోదన్నమాట. అయితే, వచ్చింది ముందస్తు బెయిల్ మాత్రమే కావడంతో.. ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు’ అన్న చందాన, అవినాశ్ రెడ్డి అరెస్టయ్యే అవకాశాలూ లేకపోలేదు. అయితే, ఆవకాశాలు చాలా చాలా తక్కువ.
తల్లి అనారోగ్యం నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదీ అసలు సంగతి. ఈమాత్రందానికి వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా ‘న్యాయం గెలిచింది’ అంటూ ప్రకటించేసుకుంటుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
ఇక, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ – అరెస్టు వ్యవహారాలపై జరుగుతున్న రచ్చపై, టీడీపీ అను‘కుల’ మీడియా కూడా కొంత అత్యుత్సాహం చూపింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సోకాల్డ్ మీడియాకి చీవాట్లు పెట్టినట్లు కూడా తెలుస్తోంది.
ఇదిలా వుంటే, ప్రతి శనివారం సీబీఐ యెదుట హాజరు కావాల్సిందిగా బెయిల్ షరతుల్లో న్యాయస్థానం పేర్కొంది. షరతులున్నవి ఆ తర్వాత సవరించుకోవడానికే.. అని ఓ సినిమాలో డైలాగొకటుంటుంది లెండి.. అది వేరే వ్యవహారం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు కావాల్సి వున్నా, హాజరు కావట్లేదు కదా.! వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా అంతేనా.?