అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి యువకుడు, యువతి “ఆంధ్ర యువ సంకల్ప్ 2025” కార్యక్రమంలో పాల్గొనాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించిన ప్రేరణాత్మక యజ్ఞమని ఆయన తెలిపారు.
భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువత శక్తిని బలోపేతం చేయడమే ఈ డిజిటల్ పరుగు ప్రధాన ఉద్దేశమని లోకేష్ పేర్కొన్నారు. ఈ పరుగు కార్యక్రమంలో మేధోశక్తి, సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలు, ఆరోగ్యం, జీవనశైలి, సమతుల ఆహారం, క్రీడల అభివృద్ధి, సామాజిక బాధ్యతలు, కుటుంబ సంబంధాల బలపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారని వివరించారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని, పేరును నమోదు చేసుకొని పాల్గొని, నైపుణ్యం, శక్తి, ప్రేరణలతో ఆంధ్రప్రదేశ్ యువతను ముందుకు నడిపిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.
