Yogi Adityanath: తమిళనాడు (taminlandu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ (Yogi Adityanath) ట్వీట్ చేశారు.
‘రావణుడి అహంకారం సనాతన ధర్మాన్ని ఏం చేయలేకపోయింది. కంసుడి గర్జనకు కూడా ధర్మం చలించలేదు. బాబర్, ఔరంగజేబుల కాలంలో కూడా సనాతన ధర్మం నశించలేదు. అంతటి శక్తివంతమైన సనాతన ధర్మం ఇలాంటి అల్ప జీవుల వల్ల ఏం అంతమవుతుంద’ని ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సనాతన నిర్మూలన అనే అంశంపై తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ గత వారం నిర్వహించిన కార్యక్రమంలో ఉదయనిధి హాజరై.. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని దానిని పూర్తిగా తొలగించాలని అన్నారు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ‘నా వ్యాఖ్యలను వక్రీకరించి.. ఓ సామాజికవర్గానికి నేను వ్యతిరేకమన్నట్టు సృష్టించారు. నేను ఏ మతానికీ వ్యతిరేకం కాద’ని ఓ ప్రకటన విడుదల చేశారు.
