ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును అదనంగా జతచేసి, అవన్నీ వ్యవసాయానికి చిహ్నం అని సర్కారు చేసుకున్న సమర్థింపును సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. కోర్టులతో ఆటలాడొద్దని గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు తీర్పు వెలువడిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల తీరు మారడంలేదు.
తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో రైతు భరోసా కేంద్రంగా ఏర్పాటు చేసిన భవనానికి వైఎస్సార్ సీపీ జెండా రంగులతోపాటు మట్టి రంగును వేస్తుండటం చర్చనీయాంశమైంది. కోర్టు వద్దని చెప్పిన తర్వాత కూడా అవే రంగులు వేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే, ఇది సర్కారు ఆదేశాలతో జరుగుతోందా లేక స్థానిక ప్రజా ప్రతినిధుల అత్యుత్సాహమా అనేది ఇంకా తెలియలేదు. కోర్టు ఆదేశాలకు సంబంధించి అవగాహన లేకపోవడం వల్లే ఇది జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.
వాస్తవానికి కుప్పం వ్యవసాయశాఖ కార్యాలయంలో పై అంతుస్తును రైతుభరోసా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఆ భవనానికి ప్రభుత్వం ఇటీవల జారీచేసిన 623 జీవో ప్రకారం రంగులు వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి కోర్టు తీర్పు వెలువడలేదని, అందుకే ఆ రంగులు వేశారని స్థానిక నేతలు అంటున్నారు. మరి తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రంగులు తొలగిస్తారా లేక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.
255648 333632Sweet web website , super layout, real clean and utilize pleasant. 856786
274157 126568Some truly nice stuff on this internet site , I it. 970558