తమ అభిమాన నాయకులు కావొచ్చు, తారలు కావొచ్చు.. అలా అలా వెళుతోంటే, వారిపై పూల వర్షం కురిపించడం అన్నది కొందరికి సర్వసాధారణమైన విషయమే.! కానీ, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడుతున్న వేళ ప్రజా ప్రతినిథులు, ‘రాచరిక పోకడలకు’ దిగితే ఎలా.? ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతలు, ప్రజలతో ‘పూలబాట’ వేయించుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావిత జిల్లాల్లోనూ ఈ తరహా పరిస్థితులు చోటు చేసుకుంటుండడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో తాగు నీటి బోరు ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఈ క్రమంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె నడుస్తూ వెళుతోంటే, రోడ్డుపై పూల వర్షం కురిపించారు. అక్కడికి ఆమె మహారాణిలా.. అక్కడున్న జనమంతా ఆమెకు బానిసలుగా.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
మామూలు రోజుల్లో అయితే దీన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ పూల జల్లు ఏంటి.? అన్నదే ప్రశ్న. పైగా, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. ఈ తతంగాన్ని కష్టంగా భరించాల్సి వచ్చింది ప్రజలకి. ఎమ్మెల్యేగారేమో పూర్తి రక్షణ సాధనాలతో వచ్చారు. కానీ, ప్రజలకు అలాంటి రక్షణ సాధనాలు (మాస్క్లు, గ్లోవ్స్ వంటివి) మాత్రం లేకపోవడం గమనార్హం.
ఇదే పద్ధతిలో కొద్ది రోజుల క్రితం ఇంకో వైసీపీ ఎమ్మెల్యే (ఈ ఎమ్మెల్యే కూడా మహిళా నేత కావడం గమనార్హం) ఇలాగే పూలబాట వేయించుకున్నారు. చూస్తోంటే, క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అటకెక్కి రాచరిక పాలన ముంచుకొస్తోందా.? అన్న అనుమానాలు కలగకమానవు. కరోనా వైరస్ పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిథులు, స్థానిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించేస్తున్నారు. అంతే తప్ప, వీళ్ళకి జనం మీద అంత శ్రద్ధ వుందని ఎలా అనుకోగలం.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
Most ridiculous video of this week. That's YRSCP MLA Roja. pic.twitter.com/HT4ffPMSHj
— Dhanya Rajendran (@dhanyarajendran) April 21, 2020
754270 291528I also recommend HubPages itself, and Squidoo, which is related. 464464