Switch to English

తొమ్మిది నెలలకు 82 లక్షలు.! వైసీపీ ఎందుకిలా ఏడుస్తోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం కోసం దాదాపు 82 లక్షల రూపాయల బిల్లుల్ని విడుదల చేయాలంటూ పంచాయితీ రాజ్ శాఖ ఓ జీవో విడుదల చేసిన మాట వాస్తవం.

ఇది పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం, ఇదేమీ పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కాదు. అధికారిక నివాసం కూడా కాదు.! పైగా, 82 లక్షల రూపాయలు వెచ్చించడం అనేది, ఒక్క నెల కోసం కాదు. తొమ్మిది నెలల కోసం.

హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్, సెక్యూరిటీ సర్వీసెస్.. సహా పలు అంశాలు ఇందులో స్పష్టంగా ప్రస్తావించబడి వున్నాయి. క్యాంప్ కార్యాలయమంటే, సిబ్బంది తప్పనిసరి. ఆ సిబ్బంది జీత భత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది కూడా.!

తన క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ తదితర వ్యవహారాలకు సంబంధించి, ప్రభుత్వం నుంచి పైసా కూడా తీసుకోవడంలేదని గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏమో, ప్రభుత్వానికెందుకు అదనపు ఖర్చు.. అని, ఈ మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన జేబులోంచే ఖర్చు చేయడానికి ముందుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన క్యాంపు కార్యాలయంలో కోట్లాది రూపాయల ఖర్చుతో దుబారా చేశారు.

ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా, ఆ ఫర్నిచర్‌ని ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి తిరిగిచ్చిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఈ విషయమై జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాసినా, అట్నుంచి స్పందన లేదాయె. ఈ విషయమై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది కూడా.!

విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఏపీ డిప్యూటీ సీఎం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతే కాకుండా, 400 పంచాయితీలకు మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల విరాళాన్నీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

తన స్వార్జితం నుంచి, ఇలా విరాళాలు అందించే పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నుంచి తన అవసరాల నిమిత్తం వృధా ఖర్చు చేయిస్తారా.? ఛాన్సే లేదు. కానీ, డిప్యూటీ సీఎం కార్యాలయం, ఆయా విభాగాలకు సంబంధించిన ఖర్చులు.. ఇవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. అది ప్రభుత్వం తాలూకు బాధ్యత కూడా.

ఇవన్నీ వైసీపీకి తెలియనివి కావు. కేవలం ఎగ్ పఫ్ కోసం మూడున్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తినేసిన ఘనత వైసీపీది. విశాఖలో విలాసవంతమైన నివాసం కోసం ఐదొందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన పాపం వైసీపీది. కేవలం 82 లక్షల రూపాయలు, అదీ బాధ్యతాయుతంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తే, వైసీపీ ఏడుస్తోంది.!

దురదృష్టమేంటంటే, ఇంతలా వైసీపీ దుష్ప్రచారాన్ని చేస్తున్నా, ఖండించాల్సిన స్థాయిలో ఆ దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం ఖండించలేకపోవడం.!

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ప్రతి అనౌన్స్ మెంట్ కు ఓ డిఫరెంట్ వీడియోను ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఈసారి కూడా...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు చేయాల్సిందే..

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం తెలుగు సినిమాలు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తెరకెక్కడమే....

Plane Crash: గుజరాత్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..

Plane crash: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీ విమాన ప్రమాదం జరిగింది. గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం టేకాఫ్...

అఖండ-2 టీజర్ ఆగయా.. బాలయ్య తాండవం..

బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ రానే వచ్చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది....