తొమ్మిది నెలలకు 82 లక్షలు.! వైసీపీ ఎందుకిలా ఏడుస్తోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,457FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం కోసం దాదాపు 82 లక్షల రూపాయల బిల్లుల్ని విడుదల చేయాలంటూ పంచాయితీ రాజ్ శాఖ ఓ జీవో విడుదల చేసిన మాట వాస్తవం.

ఇది పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం, ఇదేమీ పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కాదు. అధికారిక నివాసం కూడా కాదు.! పైగా, 82 లక్షల రూపాయలు వెచ్చించడం అనేది, ఒక్క నెల కోసం కాదు. తొమ్మిది నెలల కోసం.

హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్, సెక్యూరిటీ సర్వీసెస్.. సహా పలు అంశాలు ఇందులో స్పష్టంగా ప్రస్తావించబడి వున్నాయి. క్యాంప్ కార్యాలయమంటే, సిబ్బంది తప్పనిసరి. ఆ సిబ్బంది జీత భత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది కూడా.!

తన క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ తదితర వ్యవహారాలకు సంబంధించి, ప్రభుత్వం నుంచి పైసా కూడా తీసుకోవడంలేదని గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏమో, ప్రభుత్వానికెందుకు అదనపు ఖర్చు.. అని, ఈ మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన జేబులోంచే ఖర్చు చేయడానికి ముందుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన క్యాంపు కార్యాలయంలో కోట్లాది రూపాయల ఖర్చుతో దుబారా చేశారు.

ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా, ఆ ఫర్నిచర్‌ని ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి తిరిగిచ్చిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఈ విషయమై జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాసినా, అట్నుంచి స్పందన లేదాయె. ఈ విషయమై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది కూడా.!

విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఏపీ డిప్యూటీ సీఎం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతే కాకుండా, 400 పంచాయితీలకు మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల విరాళాన్నీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

తన స్వార్జితం నుంచి, ఇలా విరాళాలు అందించే పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నుంచి తన అవసరాల నిమిత్తం వృధా ఖర్చు చేయిస్తారా.? ఛాన్సే లేదు. కానీ, డిప్యూటీ సీఎం కార్యాలయం, ఆయా విభాగాలకు సంబంధించిన ఖర్చులు.. ఇవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. అది ప్రభుత్వం తాలూకు బాధ్యత కూడా.

ఇవన్నీ వైసీపీకి తెలియనివి కావు. కేవలం ఎగ్ పఫ్ కోసం మూడున్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తినేసిన ఘనత వైసీపీది. విశాఖలో విలాసవంతమైన నివాసం కోసం ఐదొందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన పాపం వైసీపీది. కేవలం 82 లక్షల రూపాయలు, అదీ బాధ్యతాయుతంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తే, వైసీపీ ఏడుస్తోంది.!

దురదృష్టమేంటంటే, ఇంతలా వైసీపీ దుష్ప్రచారాన్ని చేస్తున్నా, ఖండించాల్సిన స్థాయిలో ఆ దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం ఖండించలేకపోవడం.!

సినిమా

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

ఎక్కువ చదివినవి

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్ వైరల్

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పాకిస్థాన్ లో ఇండియన్...

Daily Horoscope: కన్య వారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

మే 11 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో మంచి మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి....

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ఏమిటి?

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు సమస్య ఎక్కడో ఉందా? ముందు చాలా సింపుల్...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చిన టీమ్

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది మార్చి...