Switch to English

3 వారాల్లో వైసీపీ రంగులు మాయమౌతాయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

చేసిన తప్పుకి చింతించాల్సిన దుస్థితి నెలకొన్నా.. ఇంకా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతల్లో ‘అహం’ స్పష్టంగా కన్పిస్తోంది. ఇది సాదా సీదా తప్పిదం కాదు.. ‘నేరం’ కింద భావించాలేమో.! ఎందుకంటే, ప్రజాధనంతో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయించడమేంటి.? ఓ రాజకీయ పార్టీగా సిగ్గు పడాల్సింది పోయి.. చేసిన ‘చెత్త’ పనిని ఇంకా వైఎస్సార్సీపీ సమర్థించుకుంటోంది. ‘గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది.. ఇప్పుడు మేం చేస్తున్నాం..’ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ వచ్చారు వైసీపీ నేతలు.

టీడీపీ పాలన జనానికి నచ్చకనే, వైఎస్సార్సీపీకి పట్టంకట్టారన్న కనీస ‘ఇంగితం’ వైసీపీ నేతలు కోల్పోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? ‘పార్టీ రంగులే వేయాలి..’ అని ఓ మంత్రిగారు హుకూం జారీ చేశారు అధికారులకి. ఇప్పుడా మంత్రిగారు తన పదవికి రాజీనామా చేస్తారా.? కోర్టు మొట్టికాయలు వేశాక కూడా ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసిందిగానీ.. పప్పులుడకలేదు.

మూడు వారాల్లో ఆయా భవనాలకు వేసిన వైసీపీ రంగుల్ని తొలగిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. స్థానిక ఎన్నికల్లోపే ఈ వ్యవహారం ముగియాల్సి వుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయబట్టి సరిపోయిందిగానీ.. లేకపోతే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో వుండేదో ఏమో.!

స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షల్ని సైతం వాయిదా వేసిన ఘనత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ది. తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు.. ఇలా తప్పులు చేసుకుంటూ, కోర్టులతో మొట్టికాయలేయించుకోవడం వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి అలవాటైపోయిందనుకోండి.. ఇది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ రంగుల్ని తొలగించి ఆయా ప్రభుత్వ భవనాలకు కొత్త రంగులు వేయాలంటే ఎంత ఖర్చవుతుందా.?

ఆ ఖర్చుని రాష్ట్ర ఖజానా నుంచి ఎందుకు ఖర్చు చేయాలి.? వైసీపీ పార్టీ ఫండ్‌ నుంచి దాన్ని ఖర్చు చేస్తే.. ఇంకోసారి ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా ఇలాంటి వికృత చర్యలకు పాల్పడకుండా వుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులే కాదు, ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తునన వైసీపీ రంగులపైనా ‘వేటు’ పడే రోజు రావాలని ఆశిద్దాం.

ప్రభుత్వ పథకాలంటే అవి ప్రభుత్వ ఖజానా నుంచి మాత్రమే లబ్దిదారులకు చేరతాయి. కానీ, రాజకీయ పైత్యం పెరిగిపోయి.. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. ఇలా ప్రభుత్వ పథకాలకు రంగులేసుకోవడం మీద అధిక శ్రద్ధ పెడుతుండడం నైతిక విలువల్ని తుంగలో తొక్కడమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....