యామిని సాదినేని.. చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్గా పేరు ప్రఖ్యాతులు గడించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, ఏకంగా పార్టీ అధికార ప్రతినిథిగా అవకాశం దక్కించుకున్న ఈ మహిళా నేత, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేస్తున్నారు. అదేంటీ, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందంటూ ఆ మధ్య ఢిల్లీలో టీడీపీ చేసిన దీక్షలో గెటప్పులు వేసుకుని మరీ హల్చల్ చేసిన యామిని సాధినేని.. ఇప్పుడిలా చంద్రబాబుకి షాకివ్వడమా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో అంతే మరి.!
పైగా, యామినికి వున్న అనేకానేక వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఇటీవలి కాలంలో తలనొప్పులు ఎక్కువయ్యాయట. టీడీపీ అధికార ప్రతినిథిగా వున్న సమయంలో, వైఎస్సార్సీపీపైనా, వైఎస్ జగన్పైనా.. బీజేపీపైనా, నరేంద్ర మోఈపైనా యామిని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలూ ఇప్పుడామె మెడకు చుట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఒత్తిళ్ళు’ తట్టుకోలేక, బీజేపీలో చేరాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో జరిపిన యామిని సాదినేని, అతి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరాలని అనుకుంటున్నారట. మరోపక్క, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం, యామిని సాదినేనిని బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదు..’ అంటూ సింగిల్ సెంటెన్స్లో యామిని, నారా లోకేష్తో చెప్పారంటూ కొందరు టీడీపీ నేతలు మీడియాకి లీకులు పంపిస్తున్నారు. యామిని సాదినేని టీడీపీలో అధికార ప్రతినిథిగా ఛాన్స్ దక్కించుకోవడం వెనుక నారా లోకేష్ ప్రోత్సాహం చాలా వుందనీ, దాంతో లోకేష్ రంగంలోకి దిగి ఆమెని బుజ్జగించారనీ కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ, యామిని టీడీపీని వీడటం ఖాయమేనా.? నారా లోకేష్ బుజ్జగింపులు ఫలిస్తాయా.? ఇది నిజంగానే నారా లోకేష్కి అగ్ని పరీక్ష అనుకోవచ్చు. ‘లోకేష్ టీమ్ మెంబర్’ అని ముద్రపడ్డ యామిని, టీడీపీని వీడితే.. అంతే సంగతులు.!
301688 250086I like this post, enjoyed this one thanks for posting . 96056