ఇటీవల కాలంలో ఉల్లి పేరు చెప్తే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉల్లిని దూరం నుంచి చూడటం తప్పించి కొనడానికి జంకుతున్నారు. కేజీ ఉల్లి రెండు వందల వరకు చేరుకోడంతో ఉల్లి ఎందుకు దండగ అని సర్దిచెప్పుకుంటున్నారు. ఇక చోరులు, ముష్కరులు, చేతివాటం కలిగిన వ్యక్తుల చూపులు ఇప్పుడు ఉల్లిపై పడింది.
ఉల్లి కనిపిస్తే లేపేయ్ అంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో కోకొల్లుగా జరుగుతున్నాయి. ఇళ్లల్లో కంటే మార్కెట్లో, కూరగాయల షాపుల్లో దొంతనాలు ఎక్కువయ్యాయి. షాపులో ఏ వస్తువులు ఉన్నా ముట్టుకోవడం లేదు. ఉల్లిపాయలు ఉంటె మాత్రం వదలడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉల్లిపాయల బస్తాను రిక్షాలో వేసుకొని వస్తుండగా, కొందరు దుండగులు మధ్యలో అడ్డగించి 50కేజీల ఉల్లి బస్తాను ఎత్తుకుపోయారు.
మహిళలు సైతం చేతివాటం చూపిస్తున్నారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో అర్ధరాత్రి ఓ మహిళ మోటర్ బైక్ మీద కూరగాయల బండి దగ్గరకు వచ్చింది. అర్ధరాత్రి కావడంతో బండి కట్టేశారు. కూరగాయల బండిపై పరదాతో కప్పి ఉంది. అయితే, ఆ మహిళా చాకచక్యంగా తోపుడు బండి నుంచి 20కేజీల ఉల్లి మూటను ఎత్తుకొని బైక్ మీద పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటన సిసి టీవీలో రికార్డ్ కావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఉల్లికోసం మహిళలు కూడా దొంగలుగా మారిపోయారని దీన్ని బట్టి అర్ధం అవుతుంది.
814512 165967Some genuinely good stuff on this site , I it. 758514