ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధాన సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి మహిళల సమస్య, రెండోది కూడా మహిళకు సంబంధించిన సమస్యే… అదే ఉల్లి సమస్య. గత కొంతకాలంగా దేశంలో ఉల్లిపాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇలా ఆకాశానికి ఉల్లి ధరలు తాకుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు ఏదో విధంగా సబ్సిడీ ఇస్తున్నాయి.
అయితే, సబ్సిడీ ఇస్తున్నప్పటికీ కావాల్సినంత ఉల్లి మాత్రం మార్కెట్లో అందుబాటులో ఉండటం లేదు. బయట మార్కెట్లో ఇప్పుడు కేజీ ఉల్లి రూ. 150 కి చేరుకుంది. దేశంలో అత్యధికంగా ఉల్లి పంటను పండించే కర్ణాటక, మహారాష్ట్రలో విపరీతమైన వర్షాలు కురవడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది. ఫలితం ధరలకు రెక్కలు రావడమే.
దేశంలో కొరత ఉండటంతో ఉల్లిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ఆపేసింది. ఆసియాలోని చాల దేశాలకు ప్రభుత్వం ఉల్లిని ఎగుమతి చేస్తుంది. కానీ, కొరత కారణంగా, ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది ప్రభుత్వం. అంతేకాదు, దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది.
మార్కెట్లో ధరలు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం ఉల్లిని మార్కెట్ నుంచి కొనుగోలు చేసి దానిని రైతు బజార్లలో రూ. 25 రూపాయలకు అందించడం మొదలు పెట్టింది. బయట మార్కెట్ లో ఉల్లి రూ. 150 కి పైగా ఉండటం.. రైతు బజార్లో ఉల్లి రూ. కేజీ రూ. 25కి ఇస్తుండటంతో ప్రజలు ఎగబడుతున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లో నిలబడుతున్నారు.
విజయనగరంలో ఉల్లి కోసం రాత్రియంబవళ్ళు ప్రజలు రైతు బజార్ల వద్ద క్యూలు కట్టి నిలబడుతున్నారు. రైతు బజార్ల గేట్లు తెరిచే సమయంలో కొంతమంది మహిళలు ఉల్లి కోసం ఏకంగా గోడ దూకి లోనికి పరుగులు తీస్తున్నారు. విజయనగరం రైతు బజార్లో ఓ మహిళా ఎత్తైన గోడను దూకి రైతు బజార్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
502997 568691I just added this webpage to my feed reader, fantastic stuff. Cannot get enough! 947329
750765 536590Companion, this internet web site will likely be fabolous, i merely like it 714356
733318 38708Genuinely clear web web site , thanks for this post. 750288