చెన్నైలో ఒక పారిశుద్ద కార్మికురాలు ఎప్పటిలాగే చెత్త వేస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఒక శబ్దం వినిపించింది. అది ఒక నాణెం శబ్దం అనుకుంది. కాగితంలో ఉన్న నాణెం ఆ శబ్దంను చేసినట్లుగా గురించి వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. దాన్ని చూడగానే ఆమెకు బంగారు నాణెంగా అనిపించింది. వెంటనే తన పై అధికారులకు ఆ విషయాన్ని తెలియజేసి ఆ బంగారు నాణెం ఎవరిది అనే విషయాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది.
కటిక పేదరికంతో ఉన్న ఆమె ఆ అయిదు లక్షల రూపాయల విలువ చేసే బంగారు నాణెంను తీసుకోవచ్చు. కాని ఆమె అందుకు ఆసక్తి చూపించలేదు. ఊరికే వచ్చిన సొమ్ము నాకు ఎందుకు అనుకుందో ఏమో కాని ఆమె ఆ బంగారు నాణెంను ఇచ్చేసింది. కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన బంగారు నాణెం పోవడంతో గుండెలు పగిలేలా ఏడ్చిన వ్యక్తి తిరిగి ఆ బంగారు నాణెం తన వద్దకు చేరడంతో చాలా సంతోషంను వ్యక్తం చేశాడు. మొత్తంగా చెన్నైలో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.