Switch to English

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ నియోజకవర్గాల్నీ గెలిచేసుకుంటామని అధికార వైసీపీ చెబుతోంది.

ఇంకోపక్క తమ ఓటు బ్యాంకు 50 శాతం నుంచి 57 శాతానికి పెరిగిందని వైసీపీ చెప్పుకుంటోంది. వైసీపీ అనుకూల మీడియా ఇదే ప్రచారం గట్టిగా చేస్తోంది. పెయిడ్ మాఫియా కదా, ఇంతకన్నా భిన్నంగా ఎలా వుంటుంది.? అంతిమంగా, ఆ రోజు ఓట్లేసే సమయానికి ఓటర్ల ‘నాడి’ ఎలా వుంటుందన్నదానిపై ఏ రాజకీయ భవిష్యత్తు అయినా ఆధారపడి వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నది వైసీపీ అనుకూల మీడియానే చెబుతున్నమాట. సంక్షేమ పాలన ఎలా జరగుతోంది.? పెంచుతున్న పన్నులు, చేస్తున్న అప్పులతోనే కదా.? ఈ విషయాన్ని వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు.

50 శాతం ఓట్లు దక్కించుకుంటే 151 సీట్లు వచ్చినప్పుడు, 57 శాతం ఓట్లు వస్తే 175 సీట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పలు జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్న విషయమేంటంటే, వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 18 లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని. అలా ఎలా.? 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ సీట్లూ వైసీపీ కైవసం అయిపోవాలి కదా, 57 శాతం ఓటు బ్యాంకు అంటే.?

వైసీపీ ఓటు బ్యాంకు తగ్గి, టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందన్న విషయాన్ని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు గురించిన చర్చ చాలా జాతీయ సంస్థల సర్వేల్లో కనిపించడంలేదు. అది కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఖచ్చితంగా వైసీపీకి రానున్న ఎన్నికల్లో చాలా చాలా పెద్ద దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.

ఒకే ఒక్క శాతం ఓటు.. రాజకీయాల్ని మార్చేస్తుంది. 18 లోక్ సభ సీట్లకీ 7 లోక్ సభ సీట్లకీ మధ్య ఓటు శాతం తేడా చాలా చాలా తక్కువుగా వుంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఆ లెక్కన, ఎన్నికల నాటికి అరశాతం ఓటు బ్యాంకు అటూ ఇటూ అయినా, తక్కెడ లెక్కలు మారిపోతాయ్.

కానీ, అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ, కళ్ళకు ‘అధికారం’ అనే గంతలు కట్టుకునే వుంటాయి. ఆ గంతల్ని కట్టేది కూడా అధికార పార్టీ అను‘కుల’ మీడియా సంస్థలే అవుతాయ్. అప్పట్లో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. అంతే తేడా.! మిగతాదంతా సేమ్ టు సేమ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....