ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ విషయంలో మాత్రం ‘పరిపాలన’ చాలా బాగా చేసేస్తోంది. అదే రంగులేయడం. దేశ చరిత్రలోనే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేయనంత ఘనంగా ఈ రంగులేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. గుడికీ, బడికీ.. సమాధులకీ, చెట్లకీ.. ఆఖరికి జాతీయ జెండాకి కూడా వైసీపీ రంగులేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోనే జరుగుతోంది.
దేని మీదైనా తమ ముద్ర వుండాలన్న ‘కక్కుర్తి’ ఈ రంగుల రాజకీయానికి నిదర్శనం. అన్నిటికీ రంగులేశారు.. మరి ఉల్లిపాయలకు ఎందుకు వదిలేసినట్లు.? సబ్సిడీ మీద కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల్ని రైతు బజార్లలో అందిస్తున్న మాట వాస్తవం. అవి వినియోగదారులకు కొంత ఉపశమనం కూడా కల్పిస్తున్నాయి.
అయితే, కిలో ఉల్లి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం.. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లి పడిపోవడం చూస్తున్నాం. గ్రామ వాలంటీర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం, ఆ గ్రామ వాలంటీర్ల సాయం తీసుకుని.. ఇంటింటికీ సబ్సిడీ ఉల్లిపాయల్ని అందించే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నట్లు.? ఈ విషయమై విపక్షాలు మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులూ అధికార పార్టీకి సలహాలు ఇస్తున్నా.. అధికార పార్టీ పట్టించుకోవడంలేదు.
పోనీ, ఉల్లిపాయలకు వైసీపీ రంగులేసేస్తే.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ ఐడియా ఏదో బాగానే వుంది.. అన్నిటికీ రంగులేస్తున్నారు గనుక.. ఉల్లిపాయలకీ ఈ రంగులు వేసేసి అయినా గ్రామ వాంటీర్ల ద్వారా ప్రజలకు సబ్సిడీ ఉల్లి అందుబాటులోకి తెస్తే మంచిదే. ఒక్కటి మాత్రం నిజం.. ఉల్లి సమస్య అనేది దేశవ్యాప్తంగా వుంది.
అయితే, సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ సమస్యకి కారణం. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కాదుగానీ, ప్రజల బాగోగులు కోరుకునే ప్రభుత్వంగా వైఎస్ జగన్ ప్రభుత్వం, ఈ దిశగా మరింత దృష్టిని సారిస్తే మంచిదేగా.
214475 605715Thanks for your time so considerably for your impressive and remarkable guide. I will not be reluctant to endorse your web web sites to any individual who need to receive direction on this problem. 879179
375542 625Genuinely nice style and style and superb content , nothing at all else we need to have : D. 112352
720665 250889Were glad to become visitor on this pure site, regards in this rare info! 994977