శాసన మండలి ఆంధ్రప్రదేశ్లో రద్దు కాబోతోందా.? ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాలోచనలు చేస్తున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి. నిజానికి, ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. చాలాకాలంగా జరుగుతున్నదే. అధికారంలోకి వస్తూనే వైఎస్ జగన్, శాసన మండలిని రద్దు చేయాలనే ఆలోచన చేశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి దీన్నొక ఆయుధంగా వైఎస్ జగన్ మలచుకోవాలనుకున్నారట. అయితే, అప్పట్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచనని విరమించుకున్న జగన్, మండలిలో వికేంద్రీకరణ బిల్లుకి ఎదురవుతున్న అవాంతరాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారట. మండలి రద్దు దిశగా సమాలోచనలు జరిపారట.
ఇదే విషయమై మీడియాలో జరుగుతున్న చర్చపై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. మండలి రద్దు అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. కేంద్రం పాత్ర ఇందులో వుంటుందని మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రం మండలిని రద్దు చేయాలనుకుంటే, దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్నది ఆయన వాదన. కక్ష పూరిత రాజకీయాలకు ఇది నిదర్శనమంటూ టీడీపీ నేతలు, అధికార వైఎస్సార్సీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
శాసన మండలిని పెద్దల సభగా వ్యవహరిస్తారు. అయితే, అది ఈ మధ్య కాలంలో రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలూ లేకపోలేదు. శాసన సభక రాచమార్గంలో వెళ్ళే అవకాశం లేక, దొడ్డిదారిన కాన్వాయ్తో వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మండలిలో బిల్లుల్ని నెగ్గించుకోలేక, దాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న కుట్రపూరిత ఆలోచన చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ.. వైఎస్ జగన్, ఆ నిర్ణయం తీసుకోగలరా.? వేచి చూడాల్సిందే.
250117 942937You produced some decent points there. I looked online to the concern and discovered many people is going in addition to employing your site. 953808