ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు దేశంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో మార్చి 31 వరకు ఇదే విధమైన కర్ఫ్యూ విధించాలని కేంద్రం ఆదేశించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని నిన్నటి రోజున కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే, దేశంలోని చాలా రాష్ట్రాలు ఓ అడుగు ముందుకు వేసి లాక్ డౌన్ ను ప్రకటించాయి.
తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ చేశాయి. తెలంగాణలో అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిని క్లోజ్ చేయగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాక్షికంగా లాక్ డౌన్ చేసింది. ఇంటర్, పదోతరగతి పరీక్షలు యధావిధిగా నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈనెల 27 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉందని, బడ్జెట్ ప్రవేశపెట్టకుంటే అత్యవసర సర్వీసులకు డబ్బులు ఖర్చు చేయడం ఇబ్బంది అవుతుందని, అందుకే ఈనెల 27 వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.
రోజు రోజుకు కరోనా ప్రభావం పెరిగిపోతున్నది. మార్చి 27 అంటే ఇంకా నాలుగు రోజులు ఉన్నది. ఈలోగా ఈ సమస్య మరింతగా పెరిగిపోతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉన్నది. ఏది ఏమైనా ఈనెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీరుతామని వైకాపా ప్రభుత్వం చెప్తున్నది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి చూద్దాం ఏమౌతుందో.
717525 933341I like the way you conduct your posts. Hmm 716515
550959 430030Wow, fantastic blog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall appear of your web site is amazing, let alone the content material! 207372
762051 881608Rattling exceptional info can be identified on internet blog . 172831
129846 307142I discovered your blog site on google and verify several of your early posts. Continue to maintain up the superb operate. I basically extra up your RSS feed to my MSN News Reader. Looking for forward to reading extra from you in a even though! 360961