ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారా.? ఈ చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నాళ్ళ క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఏకంగా తన వద్ద కారు డ్రైవరుగా పనిచేసిన దళిత యువకుడ్ని కొట్టి చంపి, మృతదేహాన్ని బాధితుడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘటనలో, ఆ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించలేకపోయారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియో, వీడియో లీక్ ఉదంతాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పార్టీ నేతల మీద పార్టీ అధినేతగాగానీ, లేదంటే.. ఆయా ఘటనల్లో ముఖ్యమంత్రిగా బాధ్యులపైనగానీ చర్యలు తీసుకోలేకపోవడాన్ని వైసీపీలో చాలామంది ప్రస్తావిస్తున్నారు.. గోరంట్ల మాధవ్ ఉదంతాలతో వాటిని ముడిపెడుతూ, వైఎస్ జగన్ సమర్థతని ప్రశ్నిస్తున్నారు.
‘మాట తప్పం.. మడమ తిప్పం.. అని చెబుతుంటాం.. కానీ, ఏం చేస్తున్నాం.? అన్ని విషయాల్లోనూ యూ టర్నులు తీసుకుంటున్నాం.. అది చాలక, పార్టీకి చెందిన కీలక నేతలు, మహిళలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోలేకపోతున్నాం..’ అంటూ వైసీపీ అనుకూల మీడియానే, అధికార పార్టీకి సుద్దులు చెప్పే పరిస్థితి వచ్చేసింది.
ఏ సోషల్ మీడియా విభాగమైతే అడ్డగోలుగా ఇతర పార్టీలపై విరుచుకుపడేదే, ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు మహిళా కార్యకర్తలు కావొచ్చు, ‘మగాళ్లు’ కావొచ్చు, వైసీపీ అధినేత తీరు పట్ల ఒకింత బాహాటంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముమ్మాటికీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకుంటారు..’ అంటూ గోరంట్ల మాధవ్ వీడియో బయటకు రాగానే వ్యాఖ్యానించిన చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, మారుతున్న పరిస్థితులపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
‘అది ఫేక్ వీడియో లేదా మార్ఫింగ్ వీడియో అయి వుండొచ్చు..’ అని ఒకరొకరుగా వైసీపీ నుంచి వకాల్తా పుచ్చుకుంటుండడంతో, గోరంట్ల మాధవ్ మీద ఎలాంటి చర్యలూ పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ వుండవద్దన అభిప్రాయం బలపడుతోంది. ఈమాత్రందానికి మీడియాకి ‘కఠిన చర్యలు’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ‘వీడియో బైట్’ ఇచ్చారు.? అన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ.
అధినేత అంత గట్టిగా గోరంట్ల మాధవ్ని వెనకేసుకు వచ్చి వుంటారు కాబట్టే, మంత్రి రోజా సైతం.. గోరంట్ల మాధవ్ ఎలాంటి తప్పు చేయలేదన్నట్లుగా చెప్పుకోవాల్సి వస్తోంది. విపక్షాలు ఈ మొత్తం వ్యవహారంపై ఆందోళనలు చేస్తోంటే, ఓ పోలీస్ అధికారి.. ‘దిష్టిబొమ్మల్ని కాదు.. దేశాన్ని తగలబెట్టెయ్యండి..’ అనడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. వైసీపీ ఎలాంటోళ్ళను సమర్థిస్తోంది.? వైసీపీ ప్రభుత్వం ఏ పరిస్థితుల్ని ప్రోత్సహిస్తుంది.? అన్నది అర్థమవుతోందంటూ సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
295484 405973Wow i like yur site. It actually helped me with the details i wus seeking for. Appcriciate it, will bookmark. 449532
546934 93064Hello, Neat post. Theres an problem together along with your internet site in web explorer, might check this? IE still could be the marketplace leader and a huge component to folks will omit your great writing because of this difficulty. 611158