Switch to English

కరోనా కేసులు దాచిపెడుతున్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ ఈ కేసుల సంఖ్యల క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఒక్కరోజే ఐదు కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఇక ఏపీలోనూ ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసులు 40కి చేరాయి.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల విషయంలో స్పష్టత ఉండటంలేదు. మొదట్లో రోజుకు రెండు మూడు సార్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేది. కానీ ప్రస్తుతం దానికి స్వస్తి పలికినట్టు కనపడుతోంది. తెలంగాణలో ఎన్ని పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి, వారి వివరాలేంటి అనే విషయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు నానా పాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాలను వెల్లడించడానికి ముందుకు రావడంలేదు. చివరకు సోమవారం రాత్రి రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు మరణాలు చోటుచేసుకున్నాయంటూ సీఎం కార్యాలయం నోట్ విడుదల చేసింది. దీంతో అప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్యపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు.

కరోనా కేసులు, మరణాల విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తే జనం భయాందోళనళలకు గురయ్యే అవకాశం ఉందనే భావనతోనే ఇలా తక్కువ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. అయితే, ఇది సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ప్రకటించినా పలు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాలంటే కరోనా మహమ్మారి ఎంతటి భయంకరమైనదో జనాలకు తెలియజేయాల్సిందేనంటున్నారు.

ఎప్పటికప్పుడు నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కను కచ్చితంగా బయటపెడితే అప్పుడు అందరూ ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా లాక్ డౌన్ ప్రయోజనం నెరవేరుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేయాలని సూచిస్తున్నారు. కరోనా కారణంగా గద్వాలలో ఈనెల 27న ఓ వ్యక్తి మరణిస్తే.. ఆ విషయాన్ని 30వ తేదీ రాత్రి ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏపీలో బులెటిన్లు తగిన వివరాలతో విడుదల చేస్తున్నారని, అదే తరహాలో తెలంగాణ అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...