రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కేవలం హాలీవుడ్కే పరిమితం అయిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్లు ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకుల ముందుకు కూడా వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా అమెజాన్, నెట్ప్లిక్స్, హాట్స్టార్లు ఇండియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఎంతో మంది ఓటీటీల మీద వెబ్ సిరీస్లు, సినిమాలు చూస్తున్నారు. భవిష్యత్తులో ఓటీటీ బిజినెస్కు ఇండియా స్వర్గధామం అవుతుందనే ఉద్దేశ్యంతో పలువురు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే ‘ఆహా’ అంటూ ఓటీటీని పెట్టిన విషయం తెల్సిందే. దిల్రాజు, సురేష్బాబులు కలిసి ఒక ఓటీటీని ప్లాన్ చేస్తున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్బాబు ఏషియన్స్ వారితో కలిసి ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ను ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే వీరి కాంబోలో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
ఇప్పుడు మహేష్బాబు బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఏషియన్స్ వారు ఓటీటీని ఆయన కొబ్రేషన్స్లో చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బ్రాండ్ ఇమేజ్కు తోడుగా 25 శాతం పెట్టుబడి పెట్టి 50 శాతం వాటాను ఓటీటీలో పొందబోతున్నట్లుగా అప్పుడే బిజినెస్ లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మహేష్ టీం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాబోయే 10 ఏళ్లలో సినిమాలు పూర్తిగా ఓటీటీలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కనుక మహేష్బాబు ఓటీటీ పెడితే సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
484035 519146But a smiling visitant here to share the adore (:, btw fantastic style and style . 680126
111932 880288How significantly of an significant content, keep on penning significant other 243041
5088 770488Aw, this was a truly good post. In thought I would like to spot in writing in this way moreover – taking time and actual effort to create a really great article but what / things I say I procrastinate alot and also no indicates apparently get something done. 574295