2019 ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించింది. జనసేన కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఒక్క సీటు గెలుచుకున్నా, పోరాటం మాత్రం ఆపేది లేదని, ప్రజల కోసమే తాను నిలబడ్డానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పేర్కొన్నారు. దానికోసం ఇప్పటి నుంచే పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలోకి రావడం వలన ప్రజల నాడిని అంచనా వేయలేకపోయారు.
అయితే, వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ చాలా బలంగా పుంజుకోబోతున్నారు. రాష్ట్రంలో ఓ ప్రధాన శక్తిగా, ఓ ప్రధాన నాయకుడిగా పవన్ అవతరించే అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్న వైకాపా పార్టీ అన్ని ఉచితం అంటూ ప్రజల దగ్గరకు తీసుకొస్తోంది. దీని వలన తాత్కాలికంగా పేరు రావొచ్చు. కానీ, రాష్ట్రం అభివృద్ధి చెంది, ఆదాయ వనరులు సమకూర్చుకోకపోతే, అప్పుడు చేయాల్సి వస్తుంది. ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది.
కష్టమో నష్టమో పరిశ్రమలు తెచ్చుకోవాలి తప్పించి పరిశ్రమలను వెనక్కి పంపించే విధంగా చూసుకోకూడదు. అదే జరిగితే పార్టీతో పాటు రాష్ట్రం కూడా ఇబ్బందులు పడుతుంది. జగన్ అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు తాత్కాలికంగా ఊరటనిచ్చే విధంగా మాత్రమే ఉంటున్నాయి తప్పించి శాశ్వతంగా ఇబ్బందుల నుంచి తొలగించే విధంగా ఉండటం లేదు. ఇందులో మార్పులు రావాలి. అప్పుడే అన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. జనసేన పార్టీ రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మరింతగా ఫైట్ చేయబోతున్నది. అలా ఫైట్ చేసినపుడు తప్పకుండా అధికారంలోకి రావొచ్చు. 2024 లో జనసేన పార్టీ కనీసం 50కి పైగా స్థానాలు గెలుచుకునే వీలున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
779151 979535Paris Hilton: So lovely spending time with Manny and h 327068