Switch to English

రాజ్యసభ ఎంపికలు: జనసేనకు ఒక్కటైనా దక్కేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,979FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు గాను, త్వరలో ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, మూడింటిలో ఒక్కటైనా జనసేన పార్టీకి దక్కుతుందా.? అన్న చర్చ జనసేన శ్రేణుల్లో జరుగుతోంది.

రాష్ట్రంలో కూటమి అధికారంలో వున్న దరిమిలా, కూటమికి చెందిన మూడు పార్టీలు సమానంగా చెరో సీటుని పంచుకునేందుకు ఆస్కారం వుంది. కానీ, టీడీపీ రెండు స్థానాల్ని ఆశిస్తోంది, బీజేపీ ఓ స్థానాన్ని ఆశిస్తోంది. ఈ లెక్కల్లో ఓ లాజిక్ కూడా వుంది. మొత్తంగా ఖాళీ అయిన మూడు స్థానాల విషయానికొస్తే, బీద మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య.. గతంలో ఎంపీలుగా పని చేశారు.. ఈ ముగ్గురూ రాజీనామా చేయడంతో, ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.

బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. నిజానికి, ఆ ఇద్దరికీ పదవీ కాలం ఇంకా వుంది. ఆర్.కృష్ణయ్యదీ అదే పరిస్థితి. మోపిదేవికి 2026 వరకు పదవీ కాలం వుంటే, ఆర్.కృష్ణయ్య అలాగే బీద మస్తాన్ రావు 2028 వరకూ పదవీ కాలం వున్నా, తమ పదవులకు రాజీనామా చేశారు.

ఈ క్రమంలో తిరిగి ఆ ముగ్గురూ రాజ్యసభ సీట్లను ఆశించడంలో వింతేమీ లేదు. కాకపోతే, బీద మస్తాన్ రావు ఒక్కరికే టీడీపీ నుంచి రాజ్యసభకు అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో టీడీపీ నుంచి అర డజను మంది వరకు నేతలు రాజ్యసభ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు.
ఇంకోపక్క, ఆర్.కృష్ణయ్య వ్యవహారం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఆయన తిరిగి రాజ్యసభ పదవి కోరుకోవడంలేదుగానీ, జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న పదవిని ఆశిస్తున్నారట.

కాగా, రాజ్యసభకు నాగబాబుని పంపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ, రాజ్యసభ సీటు విషయమై జనసేన అధినాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకూ రాలేదు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ‘రాజ్యసభ’ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి అలాగే, లోక్ సభలోనూ సభ్యత్వం వున్న జనసేన పార్టీకి, రాజ్యసభ సభ్యత్వం అదనపు బలాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం. మరి, ఈ దిశగా జనసేనాని ఆలోచిస్తే, సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ఈక్వేషన్స్ మారొచ్చు.

ఇప్పుడు ఒకవేళ కుదరకపోతే, ఖచ్చితంగా తదుపరి అవకాశం ముందుగానే జనసేనకు ఇచ్చేలా కూటమిలో ఒప్పందాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

1 COMMENT

సినిమా

Thaman: ‘రెండూ రెండే..’ ఓజీ, రాజా సాబ్’ సినిమాలపై అప్డేట్స్ ఇచ్చిన...

Thaman: సంక్రాంతి సందర్భంగా సోషల్ మీడియాలో తన సంగీత దర్శకత్వంలో రాబోయే సినిమాల అప్డేట్స్ పంచుకున్నారు తమన్. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్...

Anshu: దర్శకుడు త్రినాధరావు కామెంట్స్, క్షమాపణ.. నటి అన్షు స్పందన ఇదే..

Anshu: ఇటివల ‘మజాకా’ సినిమా ఈవెంట్లో దర్శకుడు నక్కిన త్రినాధరావు నటి అన్షుపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అన్షు బాడీ...

‘గేమ్ ఛేంజర్’ని మాత్రమే కాదు.. మొత్తంగా తెలుగు సినిమానే చంపేశారు.!

సినిమా రిలీజ్ అయిన గంటలోనే ‘హెచ్‌డీ’ క్వాలిటీతో ఎలా ‘గేమ్ ఛేంజర్’ లీకైంది.? సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో, కార్లు, బైక్‌లను రిపేర్ చేసే వర్క్ షాపుల్లో.....

రెచ్చిపోయిన ప్రగ్యాజైస్వాల్.. ఇవేం అందాలు..!

ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె చెప్పినట్టుగానే బాలయ్య ఆమెకు లక్కీ ఛార్మ్ అయిపోయాడు. ఎందుకంటే బాలయ్యతో చేస్తున్న ప్రతి సినిమా హిట్...

అందాలు పరిచేసిన పూనమ్ బజ్వా..!

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుర్రాళ్లకు తన భారీ అందాలతో కనువిందు చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త రకమైన...

రాజకీయం

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతి సినిమాల ట్రైలర్లు.. మూడింటిలో ఏది హిట్..?

ఈ సంక్రాంతికి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. పైగా మంచి హైప్ ఉన్న సినిమాలు కావడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా శంకర్ డైరెక్షన్...

తిరుపతిలో తొక్కిసలాట: ఏపీ సీఎం చంద్రబాబుకి అగ్ని పరీక్షే.!

చంద్రబాబు హయాంలోనే పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే చంద్రబాబూ వున్నారు. ఆయన వల్లే తొక్కిసలాట.. అంటూ, నేటికీ వైసీపీ విమర్శిస్తూ...

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. కావాలనే లీక్ చేశారా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను మొదటి నుంచి కావాలనే టార్గెట్...

శ్రీకాంత్ ను నమ్మి మోసపోయా.. రీతూ చౌదరి

ఏపీలోని ఓ ల్యాండ్ మాఫియా కేసులో బుల్లితెర నటి రీతూ చౌదరి పేరు మార్మోగుతోంది. రూ. 700 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టిన స్కామ్ లో ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్, రీతూ...