అభివృద్ధి లేని సంక్షేమం ఎప్పుడూ ప్రమాదకరమే. ‘మా హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది..’ అని పదే పదే వైఎస్ జగన్ సర్కార్ చెప్పుకుంటున్నా, వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నా.. వాస్తవం ఏంటన్నది వైసీపీలో అందరికీ తెలుసు. కరోనా పాండమిక్ అనేది ఓ కుంటి సాకు మాత్రమే.. అసలు అభివృద్ధి గురించిన ఆలోచనే వైఎస్ జగన్ సర్కార్ చేయడంలేదు.. కేవలం సంక్షేమం మీదనే ప్రభుత్వం పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ ముచ్చటా ముగిసినట్టే కనిపిస్తోంది.
సంక్షేమ పథకాలు పొందుతున్నవారిలో అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియ షురూ అయ్యింది. దాంతో, ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. మరీ దారుణంగా, వృద్ధాప్య పెన్షన్లలో కోత విధించడమేంటి.? ఎన్నో పండుటాకులు, వృద్ధాప్య పించన్లు కోల్పోయి లబోదిబోమంటున్నారు. ఇదొక్కటే కాదు, రేషన్ సరుకుల విషయంలోనూ, ఇతరత్రా సంక్షేమ పథకాల విషయంలోనూ అనర్హుల ఏరివేత అన్నది జోరుగా సాగుతోంది.
‘అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తాం.?’ అన్నది ప్రభుత్వ పెద్దల వాదన. మరి, రెండేళ్ళుగా ఎలా ఇచ్చారు.? అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం దొరకదు. ఇలా, చాలా అంశాల విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇంకోపక్క అప్పులు దొరకడం గగనమైపోవడంతో.. సంక్షేమ పథకాల్ని అమలు చేయడం కూడా ముందు ముందు మరీ కష్టమైపోనుంది.
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో చేసిన అప్పుల్ని, కేవలం రెండేళ్ళలోనే వైఎస్ జగన్ అధిగమించేసిందన్న విమర్శ వుంది. ఇందులో దాపరికమేమీ లేదు.. అన్నటికీ పక్కగా లెక్కలు కనిపిస్తున్నాయి. ‘ప్రజల్ని ఉద్ధరించడానికే అప్పులు చేస్తున్నాం..’ అని వైసీపీ చాలా గొప్పగా చెప్పుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన అయితే అప్పులకు కొత్త అర్థాలు చెబుతున్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు దుర్మార్గం.. వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్న అప్పులు అద్భుతం.. అని ఆయనకు చెందిన రెండు వెర్షన్లు.. అప్పటివి, ఇప్పటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో అధికార వైసీపీ వైఫల్యాలు ప్రజలకు అర్థమైపోతున్న దరిమిలా, ప్రభుత్వ పెద్దల్లో అసహనం పెరిగిపోయి, విపక్షాలపై భౌతిక దాడులకు వరకు వెళ్ళింది పరిస్థితి.
ముందు ముందు పరిస్థితులు ఎలా మారిపోతాయో ఊహించడం కష్టం. అందుకే, ముందస్తు ఎన్నికల ఆలోచనల్ని ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారట. మంత్రి వర్గ విస్తరణ అనేది ఓ పెద్ద తలనొప్పి గనుక.. అది లేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళతారా.? అన్నది ఇంకో చర్చ. మార్చి నుంచి పీకే టీమ్ (ప్రశాంత్ కిషోర్ టీమ్) రంగంలోకి దిగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందిగానీ, నిజానికి.. ఇప్పటికే ఆ టీమ్ తన పని తాను చేసుకుపోతోందనీ.. ఆ నివేదికల్లోని పరిస్థితుల పట్ల ఆందోళనతో, ప్రభుత్వ పెద్దలు ముందస్తు ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్నారనీ తెలుస్తోంది. ఇదెంత నిజం.? అన్నదానిపై స్పష్టత రావాలంటే ఇంకొద్ది నెలలు ఓపిక పడితే సరిపోతుందేమో.
873070 966385hey there i stumbled upon your site looking around the web. I wanted to say I enjoy the appear of things about here. Maintain it up will save for confident. 74804
644747 407862An attention-grabbing dialogue is value comment. I believe which you need to have to write far more on this matter, it wont be a taboo subject nevertheless normally individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 405047