జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్కి తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం, టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్తో కలిసి లాంగ్ మార్చ్ వేదికని పంచుకోవడం తెలిసిన విషయాలే. స్వయంగా పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఫోన్ చేసి, లాంగ్ మార్చ్కి మద్దతివ్వాలని కోరారు. ఇప్పుడు చంద్రబాబు చేయబోతోన్న దీక్షకి, పవన్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు.
ఒకరకంగా ఇది పవన్ కళ్యాణ్కి తలనొప్పి వ్యవహారమే. జనసేన తరఫున వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్నీ, కొందరు జనసేన ముఖ్య నేతల్నీ పవన్, చంద్రబాబు దీక్షకి పంపితే కుదరదన్నది టీడీపీ నేతల వాదన. కానీ, పవన్ కళ్యాణ్ గనుక చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకుంటే.. ఆ తర్వాత వైసీపీ నుంచి వచ్చే విమర్శల్ని తట్టుకోవడం అంత తేలిక కాదు జనసేన పార్టీకి.
నిజానికి, లాంగ్ మార్చ్ కోసం ఆయా పార్టీల మద్దతు కోరే క్రమంలో జనసేన మద్దతుదారులు, టీడీపీని మాత్రం ఆహ్వానించొద్దని సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, అది 30 లక్షల మందికి పైగా భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్య కావడంతో, అన్ని పార్టీల్నీ కలుపుకోవాలని జనసేన అధినేత భావించారు.
కానీ, ఇప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ తెలివిగా జనసేనను ఇరికించేస్తోంది. అందుకే, చంద్రబాబుతో స్నేహాన్ని అత్యంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడగా అభివర్ణిస్తుంటారు. మరి, ఈ సమస్య నుంచి జనసేన అధినేత ఎలా గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే.
589775 372864fantastic post. Neer knew this, regards for letting me know. 908970
630814 789072I enjoy what you guys are usually up too. This kind of clever function and reporting! Maintain up the very very good works guys Ive added you guys to blogroll. 995280
57748 672923Some truly wondrous work on behalf of the owner of this website, perfectly wonderful topic material . 73291