2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైనప్పటికీ ఓటు బ్యాంక్ పెరిగింది.
అంతేకాదు, ఎన్టీఆర్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. పార్టీకి కాకూండా ఎన్టీఆర్ కు క్రేజ్ పెరగడంతో బాబు షాక్ అయ్యాడు. ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టి ఎన్టీఆర్ కు జనాలు జైకొడతారేమో అనుకోని పక్కన పెట్టారు.
ఆ తరువాత పదేళ్ళపాటు బాబు ఎన్టీఆర్ ను పిలవలేదు. ఎన్టీఆర్ తో పాటుగా హరికృష్ణను కూడా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, 2019 ఎన్నికలకు ముందు హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆ సమయంలో బాబు కొంత అండగా నిలిచారు. బాలకృష్ణ కూడా జూనియర్ కుటుంబానికి అండగా ఉన్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఇబ్బందుల్లో ఉన్నది. ఒకప్పుడు తెలంగాణాలో ఎలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నదో, ఇప్పుడు కూడా అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిపోయో పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ బలం పెరగడంతో పాటుగా అన్ని విషయాల్లోనూ దూకుడు కనబరుస్తున్నారు. పైగా ఇప్పుడు బాబుపై కేసులు నడవబోతున్నాయి. ఎప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందో చెప్పలేని స్థితి. లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే పార్టీ నడుస్తుందని గ్యారెంటీ లేదు.
అందుకే బాబు చూపులు మరలా జూనియర్ వైపు సారిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా లోకేష్ దీనికి ఒప్పుకుంటాడా? లేదా అన్నది సందేహం.
399692 125811Im having just a little issue I cant subscribe your feed, Im employing google reader fyi. 791274