నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దుబ్బ ప్రాంతంకు చెందిన గంధం రమేష్ మేస్త్రీ పని చేస్తూ జీవితంను సాగిస్తూ ఉన్నాడు. అతడు ప్రతి రోజు తాగి వచ్చి భార్య పద్మను వేదిస్తూ ఉండేవాడు. ప్రతి రోజు తాగి వచ్చి కారణం లేకుండా పద్మను కొట్టడంతో పాటు ఇష్టానుసారంగా మాటలు అంటూ మానసికంగా వేదించేవాడు. భర్త వేదింపులు భరించలేక చివరకు అతడి ప్రాణాలు తీసి నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. అలాంటి భర్త ఉన్నా లేకున్నా ఒక్కటే అంటూ పోలీసుల ముందు కన్నీరు పెట్టుకుంది.
మే 30వ తారీకున రమేష్ బాగా తాగి వచ్చాడు. ఆ సమయంలో కొడుకులను మరియు పద్మను కూడా రమేష్ కొట్టాడు. పద్మను చితకబాది పడుకున్నాడు. పడుకుని ఉన్న రమేష్ను తెల్లవారు జామున ఒక వైర్ తీసుకుని కొడుకుల సాయంతో గొంతు నొక్కి పద్మ చంపేసింది. ఊపిరి ఆడని రమేష్ చనిపోయాడు. కొడుకులతో కలిసి పద్మ పోలీసుల వద్దకు వెళ్లింది. తన భర్త పెట్టే హింసను తట్టుకోలేక కొడుకులతో కలిసి చంపేశాను అంటూ చెప్పుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు పద్మను అరెస్ట్ చేసి ఎంక్వౌరీ ప్రారంభించారు.
262196 740627Hi! I discovered your site accidentally today, but am actually pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 33013
39740 628510Actually your creative writing abilities has inspired me to get my own blog now. Actually the blogging is spreading its wings fast. Your write up is a good example of it. 750312