దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల.! ఆరోపించడం చాలా తేలిక.! కానీ, నిరూపించేదెవరు.? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలున్నాయ్ జాతీయ స్థాయిలో. రాష్ట్రాల స్థాయిలో సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలూ వున్నాయ్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆయన అకాలమరణం చెందారు. వాస్తవానికి అప్పట్లోనే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై. కానీ, అది కేవలం హెలికాప్టర్ ప్రమాదమేనని విచారణలో తేల్చారు.
తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణ చేపట్టారంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ జగన్ కక్కుర్తి పడ్డారనే ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఆరోపించినోళ్ళంతా ఇప్పుడు వైఎస్ జగన్ పంచనే వున్నారు.
రాజకీయం అంటేనే ఇంత.! ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత ‘మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి హోదాలో వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, వైఎస్సార్ మరణం మీద వైఎస్ జగన్ ఎలాంటి ప్రత్యేక విచారణకూ ఆదేశించలేకపోయారంటే, దానర్థమేంటి.?
ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోతే, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీలుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి ఏ స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్నారో చూస్తున్నాం.
మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావొచ్చు, వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ షర్మిల కావొచ్చు.. ఎందుకు వైఎస్సార్ హత్య వెనుక కుట్రను ఛేదించేలా న్యాయపోరాటం చేయలేకపోయారు.? రాజకీయం అంటేనే ఇంత.! ఎన్నికల్లో ఓట్లు కావాలి.! వైఎస్సార్ ఫొటోతో మాత్రమే కాదు, ఆయన మరణంపై అనుమానాలలు రేకెత్తించి కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు. ఇది ఓ స్పెషల్ పొలిటికల్ ట్రిక్ అంతే.!
523209 775214Some times its a pain within the ass to read what folks wrote but this web site is quite user friendly ! . 49178
163435 748223Very effectively written story. It will be valuable to anyone who usess it, including yours truly . Keep up the very good function – canr wait to read much more posts. 712857