Switch to English

అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్న జగన్, అసెంబ్లీలోకి వెళ్ళడానికెందుకు భయపడుతున్నట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,797FansLike
57,764FollowersFollow

ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు, ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అసెంబ్లీ వైపు అస్సలు చూడకుండా, అసెంబ్లీ చుట్టూనే తిరుగుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎక్కడో లేదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్‌కి కూతవేటు దూరంలోనే వుంది. పైగా, పెళ్ళిళ్ళకీ.. చావులకీ కూడా వెళ్ళి వస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఓ వైపు పెళ్ళిళ్ళలో వధూవరులకు ఆశీర్వచనాలు, చావు ఇళ్ళకు వెళ్ళి పరామర్శ యాత్రలూ చేసేస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే.

పెళ్ళిళ్ళకు వెళ్ళడం తప్పు కాదు.. చావు ఇంటికి వెళ్ళి పరామర్శించడమూ తప్పు కాదు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అది ఓ బాధ్యత కదా.? ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే.

అనారోగ్య కారణాలు సాకుగా చూపితే అదో లెక్క.! దిట్టంగానే వున్నారు కదా.. అసెంబ్లీ చుట్టు పక్కలే.. అంటే, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే కదా.. శుభకార్యాల్లో పాల్గొనడం, అశుభకార్యాల నేపథ్యంలో పరామర్శల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నది.?

కూటమి పార్టీలు ప్రశ్నించడం ఓ లెక్క.. రాష్ట్ర ప్రజానీకం ఛీ కొడుతుండడం ఇంకో లెక్క.! పులివెందుల ప్రజానీకం సైతం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమర్థించే పరిస్థితి లేదు. ‘మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరిస్తావని కదా, అసెంబ్లీకి నిన్ను పంపింది.. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకెందుకు ఎమ్మెల్యే పదవి.?’ అని పులివెందుల ప్రజలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా నిలదీసే రోజులు ముందు ముందు వున్నాయ్.

అసెంబ్లీకి వెళితే, పాత పాపాలు బయటపడతాయ్.! పైగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఫేస్ చేయాలి. అంతే కాదు, డిప్యూటీ స్పీకర్ ఛెయిర్‌లో వుండే రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి ‘అధ్యక్షా’ అనాలి.. అలా అనడానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అహం అడ్డొస్తుందాయె.! అయినాగానీ, ఇదా పద్ధతి.?

కొన్ని రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై, అధికార పక్షం తనకు మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వకపోతే, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళకపోతే, అది మళ్ళీ వేరే చర్చ.

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని శాసన సభ్యుల శాసన సభ సభ్యత్వం రద్దు చేసేలా నిబంధనల్లో ఏమైనా మార్పులైనా చేసి, తగు చర్యల్ని సత్వరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీసుకుంటే మంచిది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో ఇంకెవరైనా పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి వుంటే, అసెంబ్లీకి వెళ్ళి.. పులివెందుల ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి, ఆ సమస్యలకు పరిష్కారం వెతికేవారే.

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనే కాదు, వైసీపీ గెలిచిన మిగతా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి ఆయా ప్రజా ప్రతినిథుల మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అందరి మీదా, ఒకేసారి అనర్హత వేటు పడే అవకాశముందా.?

సినిమా

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్...

‘రెట్రో’ భారీ విజయం సాధించాలి : విజయ్ దేవరకొండ

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది....

చిరంజీవికి విలన్ గా యువ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆడియన్స్...

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా...

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రాజకీయం

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

ఎక్కువ చదివినవి

నెత్తురోడిన కశ్మీర్.. పర్యాటకులపై ఉగ్రదాడి

నిండు నూరేళ్లు కలిసి ఉండాలని ఆ జంటలు చేసుకున్న ప్రమాణాలు.. మున్నాళ్ల ముచ్చట్లే అయ్యాయి . ఉద్యోగ బాధ్యతలతో మునిగిపోయిన ఓ ఫ్యామిలీ వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్ళింది. అదే వాళ్ళకి ఫైనల్...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి పిలుపు

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)గా పిలిచే...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వాళ్లని పక్కన పెట్టి.. వీళ్లని పట్టుకున్నారు..!

ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే చాలు వారి మధ్య రిలేషన్ అంటకట్టేస్తారు. ఇక కాస్త క్లోజ్ గా ఉంటే వాళ్ల మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో వార్తలు రాస్తుంటారు. ఇక...