ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా కథనాలు రాయకూడదా.? రాస్తే, ఆ మీడియా సంస్థ అధిపతికి కావొచ్చు, రాసినోళ్ళకి కావొచ్చు.. కరోనా వైరస్ రావాల్సిందేనా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, నిన్నటి ప్రెస్ మీట్లో ఓ మీడియా సంస్థని ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ కేసీఆర్, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై గుస్సా అయ్యారు. అలా ఆయన టార్గెట్ చాలా ‘ప్రిసైజ్’గా మారింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్, ఓ ప్రముఖ న్యూస్ ఛానల్తో పాటు పత్రిక వున్న మీడియా సంస్థలపై తెలంగాణలో అప్పట్లో అనధికారిక బ్యాన్ నడిచింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయనుకోండి.. అది వేరే విషయం.
రాజకీయాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితి వేరు. జరుగుతున్న లోటుపాట్లను మీడియా ప్రస్తావించడం మంచిదే. అసలు మీడియా బాధ్యతే అది. అదే సమయంలో, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా కథనాలు వండి వడ్డిస్తేనే అసలు సమస్య వచ్చిపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సా అయ్యింది దీని గురించే.
దాదాపుగా అన్ని మీడియా సంస్థలకీ అధికార వర్గాల నుంచి సమాచారం చాలా తేలిగ్గానే దొరుకుతుంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వమూ మీడియాకి సమాచారం ఇవ్వకుండా వుండడంలేదు. అలాంటప్పుడు తమ దృష్టికి ఏదన్నా సమస్య వస్తే, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వివరణ తీసుకోవచ్చు కదా.! అన్నది ఆయా ప్రభుత్వాలు చెబుతున్నమాట.
ఏదిఏమైనా, మీడియా పట్ల ఈ స్థాయి అసహనం కొంత అభ్యంతరకరమే అయినా, మీడియాలో దిగజారుతున్న విలువల నేపథ్యంలో.. ‘అదే కరెక్ట్’ అనే భావనకి జనం కూడా వచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కులం మాటున, రాజకీయం మాటున నడిచే మీడియా సంస్థలతోనే మొత్తంగా తెలుగు మీడియాకి ఈ దుస్థితి దాపురించిందన్నది నిర్వివాదాంశం.
863596 440994Some truly nice and utilitarian info on this internet site , besides I believe the layout holds great features. 762800
123709 354007Hey, you used to write exceptional, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past couple of posts are just slightly out of track! come on! 821521
143091 767239excellent post, very informative. 939939