సాహో చిత్రం చేస్తున్న సమయంలోనే ప్రభాస్ 20వ చిత్రంను రాధాకృష్ణ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. సాహో విడుదలకు ముందే కొంత మేరకు షూటింగ్ కూడా చేశారు. మొదట ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ను అనుకున్నారు. కాని ప్రస్తుతం ఈ సినిమాకు ఓ డియర్ లేదా రాథే శ్యామ్ టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. కరోనా లాక్డౌన్ లేకుండా ఉంటే ఇప్పటికి మెజార్టీ షూటింగ్ పూర్తి చేసేవారు. ఈ ఏడాది చివరి వరకు అయినా ఈ చిత్రంను విడుదల చేసేవారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడాదిలో ఈ చిత్రం వస్తుందని ఆశించడం కష్టమే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రారంభం గురించి కాని.. ఇతరత్ర విషయాలను మొదట బయటకు రానివ్వలేదు. ఎట్టకేలకు దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా ఓపెనింగ్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ సినిమా గురించిన చర్చ మీడియాలో తారా స్థాయిలో జరుగుతోంది.
ఈ చిత్రం ప్రారంభోత్సవంలో రాజమౌళి, వినాయక్లతో పాటు కృష్ణంరాజు ఇతర ప్రభాస్ సన్నిహితులు పాల్గొన్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సంగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ స్టిల్స్ విడుదల చేయడం ఏంటీ రాధా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నుండి ఏదో గొప్ప అప్ డేట్ వస్తుందంటే పాత ఫొటోలను వదిలారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
639902 156804Housing a different movement in a genuine case or re-dialed model. 767342