ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. దానికి కారణం .. నిన్న తెలుగు హీరోయిన్ అంజలికి సంబందించిన ఓ పోస్టర్ ని విడుదల చేయడమే. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం సినిమాకు సంబందించిన అంజలి ఫస్ట్ లుక్ ఒకటి విడుదల అయింది. ఆ సినిమాలో అంజలి సి బి ఐ అధికారిగా కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆసక్తికర విషయం ఏమిటంటే .. ప్రముఖ రచయిత కోన వెంకట్ .. హీరోయిన్ అంజలి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం? అన్నది ఆ వైరల్ న్యూస్ ?
తెలుగు భామ అంజలి హీరోయిన్ గా తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ అమ్మడు తమిళహీరో జై తో ప్రేమాయణం కూడా సాగించిందని న్యూస్ వచ్చాయి. ఆ తరువాత జై తో బ్రేకప్, ఓ దర్శకుడితో విభేదాలు రావడంతో కోలీవుడ్ లో అంజలికి క్రేజ్ తగ్గి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే కోన వెంకట్ .. అంజలికి సపోర్ట్ ఇచ్చి తాను నిర్మాతగా మారుతూ గీతాంజలి సినిమా తీసాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో రచయితగా తాను చేస్తున్న సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించాడు.
శంకరాభరణం సినిమాలో అంజలి మెయిన్ రోల్ చేసింది. ఆ తరువాత బాలయ్య డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించాడు. ప్రస్తుతం కోన వెంకట్ కు రచయితగా అవకాశాలు తగ్గాయి .. దాంతో అయన పూర్తిగా నిర్మాతగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న నిశ్శబ్దం సినిమాలో కూడా అంజలికి ఛాన్స్ ఇప్పించాడు. నిజానికి హాలీవుడ్ రేంజ్ నటీనటులను పెట్టుకున్న ఈ సినిమాలో కావాలనే అంజలికి ఛాన్స్ ఇచ్చాడు కోన అని గుసగుసలు వినిపిస్తున్నాయి ..!!
