దేవర.. ఎందుకీ ఫేక్ నెంబర్లు.. ఎన్టీఆర్ ను ట్రోల్ చేయించడానికా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,696FansLike
57,764FollowersFollow

ఎన్టీఆర్ నుంచి చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన దేవర మూవీ హిట్ అయింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి కలెక్షన్లు బాగానే వచ్చినప్పుడు వచ్చినవి చెప్పుకుంటే సరిపోతుంది కదా.. అలా కాకుండా ఏదో భారీ హైప్ ఇవ్వాలనే అత్యుత్సాహంతో నమ్మలేని విధంగా కలెక్షన్ల పోస్టర్లు వేసేసి ఎందుకీ హడావిడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. నైజాం ఏరియాలో దేవర మూవీని రూ.45 కోట్లకు అమ్మారు. కానీ మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లు ఈ ఏరియాలో వచ్చేసినట్టు పోస్టర్లు వేసేస్తున్నారు పీఆర్ టీమ్.

ఇక దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి మరింత నెంబర్లు పెంచేసి ఫేక్ పోస్టర్లు వేస్తారేమో. అలా ఎందుకు చేయడం. ఈ ఏరియాలో మొదటి రోజు రూ.14 కోట్లు మూవీ వసూలు చేసింది. రెండో రోజు ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ నెంబర్లు చెప్పుకుంటేనే చాలా బెటర్. కానీ రెండు రోజుల్లోనే మరో పది కోట్లు వీరే ఆడ్ చేసుకుని చూపించుకోవడం ఎన్టీఆర్ ను ట్రోల్ చేయించడానికేనా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఒక్క చోటనే కాదు చాలా చోట్ల పీఆర్ టీమ్ వాళ్లు వచ్చిన వసూళ్లకు మరో ముప్పై శాతం పెంచేసి పోస్టర్లు వేసేస్తున్నారు.

దాంతో ఈ పోస్టర్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇంత మంచి సినిమాకు కలెక్షన్లు వచ్చినవి వేసుకుంటే ఇంకా మంచి క్రేజ్ పెరిగేది. అలా కాకుండా వచ్చిన హైప్ ను చెడగొట్టడానికే ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేస్తున్నారా అని మండిపడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

సినిమా

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

పోచమ్మ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఆహా

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “పోచమ్మ” సిరీస్‌కు సంబంధించిన...

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

రాజకీయం

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మిథున, తుల రాశుల వారికి కొత్త అవకాశాలు – కుంభ రాశివారికి పనుల్లో పురోగతి సూచనలు

మార్చి 9, 2026 సోమవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. చిన్న చిత్రంగా థియేటర్లలో విడుదలై...

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...