Switch to English

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకున్నాం.

అసలేంటి ఈ ఉప ముఖ్యమంత్రి పదవి.? ఈ పదవికి, మిగతా మంత్రులతో పోల్చితే వున్న ప్రత్యేకత ఏంటి.? ఈ ప్రశ్నల చుట్టూ చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి కూడా సాధారణ మంత్రే. ఆయనకంటూ ప్రత్యేకంగా అధికారాలు ఏమీ వుండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో, విభజన ఉద్యమాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రాధాన్యత ఏర్పడింది. విభజనవాదులను ఏమార్చేందుకు అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పదవిని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత, అదో ఆనవాయితీగా మారింది తెలుగు రాష్ట్రాల్లో.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బలపర్చిన టీడీపీ – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. అప్పుడూ ఉప ముఖ్యమంత్రులున్నారు. వైసీపీ హయాంలో అయితే, బోల్డంతమంది ఉప ముఖ్యమంత్రులు పని చేశారు. కాస్తో కూస్తో టీడీపీ – బీజేపీ హయాంలో పని చేసిన ఉప ముఖ్యమంత్రులకే కాస్త గుర్తింపు వుండేది. వైసీపీ హయాంలో ఎవరు ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారో, వైసీపీ నేతలకే గుర్తు లేని పరిస్థితి.

ఇక, ఇప్పుడు మాత్రం.. ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ కళ్యాణ్ ఒక్కరే వున్నారు.. టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ, ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు మాత్రమే ఇచ్చారు.

పదవి ఇస్తే సరిపోతుందా.? ఆ పదవికి ఆయన గౌరవం తీసుకురావొద్దూ.? గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పని చేసినవారు తీసుకురాని గౌరవాన్ని, ఆ పదవికి పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టారు. ‘ఉప ముఖ్యమంత్రి అంటే సీఎం కంటే పవర్ ఫుల్..’ అనే స్థాయికి ఉప ముఖ్యమంత్రి పదవి తాలూకు గౌరవాన్ని పెంచారు.

తిరుపతి లడ్డూ విషయానికొస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.. దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేరే లెవల్‌కి తీసుకెళ్ళారు. మహిళలపై దాడుల విషయంలోనూ, ఇతరత్రా అభివృద్ది కార్యక్రమాల్లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ నిర్ణయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పూర్తి మద్దతు వుంటోంది.

ఉప ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రికి కుడి భుజంలా వుండాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నది అదే. అందుకే, ఉప ముఖ్యమంత్రి పదవి గురించి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పని తీరుకి, సీఎం చంద్రబాబు నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.

ఎప్పుడైతే లోకేష్ కూాడా ఉప ముఖ్యమంత్రి అవ్వాలని కొందరు టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారో, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి పదవి కాకుండా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలని టీడీపీ నేతలు కోరుకోవడం ద్వారా, సీఎం పోస్ట్ కంటే డిప్యూటీ సీఎం పోస్ట్ పవర్ ఫుల్.. అని తేలిపోయినట్లయ్యింది.

మరి, ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి అంత పవర్ అద్దింది ఎవరు.? పవన్ కళ్యాణే కదా.! ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులూ ఒప్పుకుంటున్నాయి. ఇంకో నాలుగేళ్ళు ఇదే ఈక్వేషన్ ఇలాగే కొనసాగాలనీ, పవన్ కళ్యాణ్‌ని తక్కువ చేయాలని చూస్తే, అది టీడీపీకే నష్టమని.. టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.

మిగతా విషయాల్ని పక్కన పెడితే, డిప్యూటీ సీఎం.. అనే పదవి పట్ల రాష్ట్ర ప్రజలకీ ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. ఆ పదవిలో పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా పని చేస్తుండడం వల్లే ఇదంతా. చంద్రబాబు మంత్రి వర్గంలో ఏ మంత్రి ఇంత బాధ్యతాయుతంగా పని చేసినా, ఆ మంత్రికీ ఇదే గౌరవం దక్కుతుంది.. ఆయా శాఖల గౌరవం పెరుగుతుంది.. టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులందరికీ ఇది వర్తిస్తుంది.

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ప్రధాని మోదీ విశ్వాసం నిజమైంది : పవన్ కళ్యాణ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి...

రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...

ఎక్కువ చదివినవి

ప్రధానితో అక్కినేని కుటుంబం..!

అక్కినేని ఫ్యామిలీ సభ్యులు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్ లో కలిశారు. అక్కినేని నాగేశ్వర రావు 100వ జయంతి సందర్భంగా మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ అనే...

పూజా హెగ్దే టంగ్ స్లిప్ అయ్యిందా..?

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతుంది. రాధేశ్యామ్ తర్వాత అమ్మడిని పట్టించుకునే వారే లేరన్నట్టు పరిస్థితి ఏర్పడింది. మహేష్ గుంటూరు కారంలో ముందు ఆమెనే హీరోయిన్...

బీసీలపై విషం చిమ్ముతున్న వైసీపీ..వారికి కేటాయించిన మద్యం షాపులను అడ్డుకునే కుట్ర!

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో కల్లు గీత కార్మికులకు 10% దుకాణాలను కేటాయించిన విషయం తెలిసిందే. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు. ఐఎస్ టీఎల్ టీ10 లీగ్ మ్యాచ్...

ఆంధ్ర ప్రదేశ్‌లో వుండటానికి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారు.?

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్...