అసలు ప్రభుత్వాన్ని నడిపేవారికి సలహాదారులు ఎందుకు.? ఈ ప్రశ్న తరచూ తెరపైకి వస్తోంది. సలహాదారుల విషయమై హైకోర్టు ఇటీవల అక్షింతలు వేసినాగానీ, ఏపీలో వైసీపీ సర్కారు ‘తగ్గేదే లే’ అంటోంది. సరే, సలహాదారులు అవసరమే అనుకుందాం.! ఆ సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు.? ఆ సలహాల వల్ల ప్రజలకు లాభమేంటి.? సలహాదారుల వల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత లాభం.? ఎంత నష్టం.?
ఆయా సలహాదారులకు కనీసం లక్ష.. గరిష్టంగా నెలకు మూడు లక్షల రూపాయల మేర ప్రయోజనాలు కలుగుతున్నాయన్నది ఓ అంచనా. గౌరవ వేతనం, ఇతర సౌకర్యాలు.. ఇవన్నీ కలుపుకుంటే, రాష్ట్ర ఖజానా మీద భారీగానే భారం పడుతోంది ఈ సలహాదారుల వల్ల. మరి, ఈ సలహాదారుల కారణంగా ప్రభుత్వానికి కలుగుతున్న లాభమేంటి.? అదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తాజాగా, ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా సింగర్ మంగ్లి నియమితురాలైందట. నిజానికి, మార్చిలోనే ఈ విషయమై జీవో జారీ అయ్యిందట.. కానీ, ఆమె కాస్త లేటుగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిందట. ఎస్వీబీసీ ఛానల్కి సలహాదారు ఏంటబ్బా.? అని ఆశ్చర్యపోవద్దు.! సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది కదా.! ఇదీ అంతే.!
వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి సలహదారు.. అనగానే, ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకొస్తుంది. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ కూడా కల్పించారండోయ్.! ఆయన ఇచ్చే సలహాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుతోంది.? ప్రభుత్వానికి ఆయన ఏమేం సలహాలిస్తున్నారు.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి.
పరిపాలన అంటే, ప్రజలకు సేవ చేయడం. రాజకీయ నాయకులు తరచూ ఇదే మాట చెబుతుంటారు. అధికారంలోకి వచ్చాక, అధికారులను ఉపయోగించుకుని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలి. కానీ, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం వేరు.! సలహాదారుల పేరుతో ప్రభుత్వ ఖజానా లూటీ అవుతోందన్న విమర్శలొస్తున్నాయి. 30 మందికి పైగా సలహాదారులున్నట్లు వైసీపీ అనుకూల మీడియానే చెబుతోంది. ఆ లెక్కన, వారందరికీ వేతనాలు, సౌకర్యాల పేరుతో ప్రతి ఏడాదీ కోట్లాది రూపాయల ప్రజాధనం ‘లూటీ’ అవుతున్నట్లే కదా.? అన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న.
81126 105559Just what I was looking for, appreciate it for posting . 836961
468147 808932Really instructive and wonderful structure of content material , now thats user friendly (:. 608010