నిశబ్దం చిత్రం ప్రమోషన్లో భాగంగా స్వీటీ అనుష్క ఇటీవల సుమ యాంకర్గా వ్యవహరించే ‘క్యాష్’ షో కు వెళ్లిన విషయం తెల్సిందే. లేడీ సూపర్ స్టార్ ఫస్ట్ టైం ఆన్ క్యాష్ అంటూ ప్రమోలు భారీ ఎత్తున వేశారు. ప్రోమోలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండటంతో పాటు ఆసక్తికరంగా అనిపించిన ఇంకా చూడాలి అనిపించిన షాట్స్ చాలానే ఉన్నాయి. షోపై ఆసక్తి పెరిగేలా ప్రోమోను కట్ చేశారు. ప్రోమోలో చివర్లో అనుష్క కన్నీరు పెట్టుకున్న షాట్స్ పెట్టారు.
వారం రోజుల పాటు ఎందుకు అనుష్క కన్నీరు పెట్టుకుందా అంటూ అంతా కూడా సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. తాజాగా ఆ ఎపిసోడ్ పూర్తిగా ప్రసారం అవ్వడంతో అసలు విషయం తెలిసింది. షోలో భాగంగా అనుష్క తాను నటించిన అరుంధతి చిత్రం విశేషాలను మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో దర్శకుడు కోడి రామకృష్ణ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. ఆయన మృతి తీరని లోటు అంటూ చెప్పుకొచ్చింది.
కోడి రామకృష్ణ గారు నన్ను నమ్మి అరుంధతి చిత్రాన్ని నాకు ఇచ్చారు. ఆయన నన్ను చాలా పెద్ద స్టార్ చేశారంటూ చెప్పుకొచ్చింది. ఇక నిశబ్దం చిత్రం కోసం తాను మూగవారు సైగల భాషను నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. నిశబ్దం చిత్రం కోసం యూనిట్ సభ్యులందరం చాలా కష్టపడ్డాం.
ప్రతి ఒక్కరం కూడా నిబద్దతతో కలిసి పని చేశామని, సినిమా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఈ అమ్మడు వ్యక్తం చేసింది. నిశబ్దం తర్వాత ఈమె సాయుద పోరాటయోధురాలు బయోపిక్లో నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
307491 501625magnificent post, really informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im positive, youve an excellent readers base already! 836812