Switch to English

ప్రాణం తీసిన రైలు పట్టాలు: ఈ పాపం పాలకులదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

రైలు పట్టాలపై నడిచి వెళ్ళడం నేరం. కానీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళాలంటే అదొక్కటే మార్గం. ఏ క్షణాన రైలు తమ మీదకు దూసుకొస్తుందోనన్న భయం ఓ పక్క వున్నా, లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి లేక, ఆకలి చావులకు భయపడి, సొంతూళ్ళకు వెళుతున్న చాలామంది ఆ రైలు పట్టాల్నే ఎంచుకుంటున్నారు తమ ప్రయాణ మార్గాలుగా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితిని చూస్తున్నాం.

కానీ ఔరంగాబాద్‌లో ఓ రైలు 15 మంది అభాగ్యుల ప్రాణాల్ని బలిగొంది. రైలు డ్రైవర్‌ (లోకో పైలట్‌) అప్రమత్తంగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమన్న వాదనను రైల్వే శాఖ కొట్టి పారేసింది. రైలు డ్రైవర్‌, పట్టాలపై జనాల్ని గుర్తించినప్పటికీ, రైలుని అదుపు చేయడం సాధ్యం కాలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రధాని ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిన్న విశాఖలో గ్యాస్‌ లీక్‌.. ఈ రోజు రైలు పట్టాలపై ఆవిరైపోయిన ప్రాణాలు.. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం మామూలే. కానీ, నేరం ఎవరిది.? లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్ళేందుకు అభాగ్యులకు అనుమతినివ్వని ప్రభుత్వాల్నే ఇక్కడ తప్పుపట్టాల్సి వుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, కూలీలను ఆదుకోవడంలో విఫలమవడంతోనే ఈ దుస్థితి దాపురించింది.

ఇదొక్కటే కాదు.. వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళుతున్నారు చాలామంది. నిండు గర్భిణి.. బాలింత.. ఇలా ఒకరేమిటి.? రోడ్లపై, రైలు పట్టాలపై అభాగ్యులు ఎందరో కన్పిస్తున్నారు. మనిషిలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. అందుకే, సాటి మనిషిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. సొంతూళ్ళకు పయనమైనవారికి మార్గమద్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు.

కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం తప్ప, ప్రభుత్వాల సాయం చివరి వ్యక్తి వరకూ చేరకపోవడంతోనే ఈ దుస్థితి. లాక్‌డౌన్‌ ప్రకటించేశాం.. మీ చావు మీరు ఛావండి.. అని కేంద్రం వ్యహరించబట్టే ఈ దుస్థితి.. అంఉటన్న విపక్షాల విమర్శల్ని తేలిగ్గా ఎలా కొట్టి పారేయగలం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...